దీపావళి విశిష్టత

P Madhav Kumar


దీపావళి రోజు ఎన్ని దీపాలు పెట్టాలి ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి..


 హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ.


దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 24 వ తారీకు సోమవారం నాడు జరుపుకోవాలి . అయితే అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి? పౌరాణిక చరిత్ర ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

*🌻దీపావళి సాంప్రదాయం🌻*


ఆశ్వయుజ బహుళచతుర్ధశినే నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు.


*ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా*


*యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||*


సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం.


*తైలే లక్ష్మీ ర్టలే గంగా దీపావళి తిధౌ వసేత్‌*


*అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే||*


దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మియు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (దారిద్య్రం మొదలైన అభాగ్యం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు తన్నివారణకై దీనిని చేయాలి.


ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా, అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలా భ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగస్నానం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది.


*ప్రాతః స్నానం తు యః కుర్యాత్‌ యమలోకం నపశ్యతి*


సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలకాలము అరుణోదయము ఆలోగా చేయాలి అలాగ చేసినవారికి నరక దర్శనం ఉండదని శాస్త్ర వచనం.


అలాగే ఆచారాల ప్రకారం, స్నానం మధ్యంలో ఉత్తరేణు, అనప, ప్రపున్నాటము (ఒక చెట్టు) శిరస్సుమీద త్రిప్పి స్నానం చేస్తే నరకంరాదు. అంటే తంటెస, (తుంటము, తుంటియము, తగిరిస, తగిరశ) అని దీనికి తెనుగులో పేర్లు. ఇది అంతటా దొరుకుతుంది. దీని పూవు. తంగేడు పువ్వులా ఉంటుంది కాని దానికంటే చిన్న పూవు. పిల్లలు ఈకాయలను కోస్తే చిటపటా పేలుతాయి. ఉరణాక్షము అనికూడా దీనికి పేరు. ఉరణ మనగా పొట్టేలు. దీని ఆకులు పొట్టేలు కండ్లలాగా వుంటాయి.


పద్మంలో :-


*అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం*


*భ్రామయేత్‌ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై||*


అని ఉన్నది.


ఈ చెట్టు త్రిప్పటప్పుడు క్రింది మంత్రంపఠిస్తూ త్రిప్పాలి.


*శీతలోష్ఠ సమాయుక్త సకంటక దలాన్విత*


*హరపాప మాపామార్గ భ్రామ్యమాణః పునః పునః||*


దున్నిన చాలులోని మట్టిపెళ్ళతో కూడినదీ, ముళ్ళతో నున్న ఆకులు గలదియూ అగు ఓఅపామార్గమా! నిన్ను త్రిప్పుతున్నాను. మాటిమాటికీ త్రిప్పబడి నీవు నాపాపమును హరింపచేయుము, అని అర్థము. అపామార్గాన్ని ఉత్తరేణు అని అంటారు.


స్నానం చేసినవెంటనే యమతర్పణం చేయాలి. ఇపుడు యముని నామావళిగల ఈ క్రింది శ్లోకాలు చెప్పాలి.


*యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ!*


*వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ||*


*ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే|*


*మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః||*


ఇతి యమం తర్పయామి, తర్పయామి, తర్పయామి. అని మూడుసార్లు నువ్వులతో (తిలాంజలులు) వదలవలెను.


యమునికి పితృత్వం దేవత్వం రెండూకద్దు. కావున ప్రాచీనావీతిగానూ, సవ్యంగానూ దక్షిణాభిముఖులై ఉభయథా తర్పణం చేయవచ్చును. 

తలిదండ్రులున్న వారు మాత్రం సవ్యంగానే చేయవలెను. 


ఈనాడు మాషపత్రభోజనం చేయాలి. అంటే మినపాకు కూర తినాలి. ఈమాసంలో ఇవి లభిస్తాయి.


*మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః|*


*ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే||*


*దీపదానం:-*

సాయంకాలం ప్రదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి. బ్రహ్మవిష్ణు శివాలయాలలోనూ, మఠము లందునూ ఇవి పెట్టవలెను.


*అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః|*


*యమమార్గే దికారేభ్యో ముచ్యతే కార్తికే నరః||*


ఇక్కడ 'కార్తికే' అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వయుజమే.


*ఉల్కాదానం (దివిటీలు):-*

దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి.


*లక్ష్మీపూజ:-*

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. 

అర్థరాత్రి పౌరస్త్రీలు చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు.


విష్ణుమూర్తిని నరక చతుర్దశినాడూ, అమావాస్య మరునాడూ పాతాళంనుంచి వచ్చి తాను భూలోకాధికారం చేసేటట్లూ, ఈనాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శాశ్వతంగా ఉండవలెననీ బలిచక్రవర్తి వరం కోరుకొన్నాడట. కావున భగవత్సంకీర్తనతో రాత్రి జాగరణం చేయాలి.


అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వర్షఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. తద్ద్వారా వాటికి ముక్తి. అందుకనే కార్తికమాసం అంతా దీపదానం ప్రాధాన్యత చెప్పబడింది. అకాశదీపంకూడా అప్పుడే.


*'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత'* తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. కాని తెలిసిచేయడం జ్ఞానంతో చేయడం దానితో మనకు ఆనందం కలుగుతుంది. కావున ఈ ఆచారాలన్నీ, సంప్రదాయాలన్నికూడా సచ్చిదానంద పరబ్రహ్మానుభవాన్ని సూచిస్తున్నాయని మనం తెలుసుకోవాలి.

*యతోధర్మః తతోజయః*

రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు.


 వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా,

ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు.


ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ 'భగినీహస్త భోజనం'’తో ముగుస్తుంది.


దీపావళి రోజు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం.


దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివస్‌గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే.


24 వ తారీకు సాయంత్రం 06 to 07 మధ్యలో శుక్రహోరా ఉంటుంది ఈ సమయం లో లక్ష్మీ పూజా ధన త్రయోదశి రోజు ఎలాగైతే చేసుకున్నారో అదేవిధంగా చేసుకుని ఆ తరువాత 11/27/54/108 దీపాలు పెట్టుకోండి..

మీ ఇంటి అష్ట దిక్కులలో దీపాలు పెట్టండి..


తూర్పు లో..6 దీపాలు 

గ్రీన్ కలర్ ఒత్తులు,,

పడమరలో..8 దీపాలు వైట్ కలర్ ఒత్తులు 

దక్షిణంలో 7 దీపాలు రెడ్ కలర్ ఒత్తులు 

ఉత్తరంలో 5 దీపాలు బ్లూ కలర్ ఒత్తులు వేసి నువ్వుల నూనెతో పెట్టండి.. ప్రతీ ప్రమీదలో 2 ఒత్తులు వెలిగించాలి...

ఇంట్లో అష్టదిక్కులలో 8 పెట్టుకోండి.. దేవుడిదగ్గర..9 తులసి దగ్గర 1 దీపం, సింహాద్వారం బయట ఎడమవైపు ఒకటి,, కుడివైపు ఒకటి.


మొత్తం 46 దీపాలు అవుతాయి..


ఇలా పెట్టుకుంటే మంచిది.. కుదరని వారు 11 పెట్టుకోండి..

ఏం అర్ధం కాకపోయినా మెసేజ్ చేయండి..


ఇవి కాకుండా మీరు ఇంకా ఎన్నైనా పెట్టుకోవచ్చు..ఎంత పెట్టుకుంటే అంతా మంచిదే...




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat