శ్రీ ఆనందవల్లీ సమేత అగస్త్యేశ్వ్వర స్వామి దేవాలయం...!!

P Madhav Kumar


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

            

🌿ఆధ్యాత్మిక చింతను మారుపేరైన భారతదేశంలో  అనేక  పవిత్ర దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు , 

ప్రాయశ్చిత్త స్ధలాలు వున్నయి.  


🌸ఈ స్థలాలను దర్శించి భక్తులు తమ భయభ్రాంతులను , చింతలను మరచిపోయి నిశ్చింతగా వుంటారు.


🌿కష్టాలు కలిగినప్పుడు  ప్రార్ధించుకుని  స్వాంతన పొంది, శక్తిని పెంపొందించుకునేందుకు ఏర్పడిన పుణ్యస్ధలాలు.ఏదైనా ఒక పుణ్య క్షేత్ర

దర్శనం చేసుకుని వచ్చిన తరువాత  జీవితంలో పెద్ద మార్పులు కలిగి శుభాలు జరగడం , మనసు కి ప్రశాంతత లభించడం వంటివి సంభవిస్తూంటాయి.


🌸అటువంటి  భాగ్యాన్ని అనుగ్రహించే ఆలయం తిరువారూరు జిల్లాలోని

పేరళం సమీపమున వున్న

తిరుక్కొడియలూరులో వుంది. 

ఈ ఆలయంలోనే  శ్రీ ఆనందవల్లీ సమేత  అగస్త్యేశ్వ్వర స్వామి  కొలువైయున్నాడు.


🌿ఈ పుణ్యస్థలంలోనే యమధర్మరాజు, శనీశ్వరుడు అవతరించినట్లుగా చెప్తారు.  శని దోషం, మృత్యుభయమే

ఒక వ్యక్తికి అత్యంత క్లిష్టమైనది.

అటువంటి కాల దోషాన్ని తొలగించి, భక్తులకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా యముడు శనీశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు. 


🌸అందువలననే  ఈ ప్రదేశంలో

అడుగు పెట్టగానే , చీకాకులు

తొలగి ప్రశాంతత కలుగుతుంది. 

ఒకానొక కాలంలో సూర్యుదేవుని భార్యలైన ఉషాదేవి

ఛాయాదేవీ   సంతాన  భాగ్యం కోసం ఇక్కడి ఈశ్వరుని ప్రార్ధించారు. 


🌿అందుకు  ఈశ్వరుడు " మీరు మీభర్తతో   వెళ్ళి తిరుమీయచ్చూర్ లో వున్న పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ

నన్ను , లలితాంబిక ని పూజించి  ఇక్కడికి వస్తే  మీకు పుత్ర భాగ్యం లభిస్తుంది." అని వరమిచ్చాడు. i


🌸ఆ విధంగానే  సూర్యుడు ,  ఉషాదేవి, ఛాయాదేవి తిరుమీయచ్చూర్  వచ్చి అక్కడిసూర్య పుష్కరిణిలో స్నానాలు చేసి పూజలు చేశారు. ఆ పూజల ఫలంగా ఉషాదేవికి యమధర్మరాజు , 

ఛాయా దేవికి శనీశ్వరుడు

జన్మించారు. 


🌿తిరుమీయచ్చూర్ లో పూజించి, యీప్రదేశంలో సూర్యుడు, ఉషాదేవి, ఛాయాదేవి కూడినందు వలన యీ ఊరికి కూడియలూరు అనే పేరు వచ్చింది. 


🌸అదే కాలక్రమేణా 

"కొడియలూరు"గా పిలువబడుతున్నది.

హయగ్రీవ స్వామి ఆదేశ ప్రకారం తిరుమీయచ్చూర్ వచ్చిన అగస్త్య మహర్షి  లలితాంబికాదేవిని మనసారవేడుకుని "లలితా నవరత్న

మాలికా  "స్తోత్రంతో లలితా దేవిని స్తుతించి  ఆ దేవి అనుగ్రహం పొందాడు.


🌿ఆ తరువాత పరమేశ్వరుని సేవించుకోవాలని  కొడియలూరికి వచ్చాడు.  అక్కడ ఒక శివలింగాన్ని

ప్రతిష్టించి పూజించాడు.

అందువలననే ,ఇక్కడి ఈశ్వరుడికి అగస్త్యేశ్వ్వరుడు అనే పేరు వచ్చింది. 

ఈశ్వరుని పక్కనే లలితా దేవిని కూడా ప్రతిష్టించి  పూజించాడు. 


🌸వేడుకున్న భక్తుల జీవితాలలో ఆనందాన్ని ప్రసాదిస్తున్న ఈ  అంబికను "ఆనందవల్లి తాయారు" అని పిలుస్తారు.


🌿తిరుమీయచ్చూరు  ఆలయంలో  లలితాపరమేశ్వరి  తపో భంగిమలో మనోన్మణి స్వరూపంగా, ఆశీనురాలై అనుగ్రహం ప్రసాదిస్తున్నది. 


🌸కొడియలూరు లలితా పరమేశ్వరి ఆనందవల్లిగా పరిపూర్ణత పొంది భక్తులను అనుగ్రహిస్తున్నది. 


🌿ఈ ఆలయ దక్షిణ దిశలో

యమధర్మరాజు, ఉత్తర దిశలో

శనీశ్వరుడు దర్శనమనుగ్రహించడం  

విశిష్టత కలిగిన విషయం.


🌸ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే యమ భయం , శని దోషము తొలగిపోతాయని  భక్తుల ధృఢవిశ్వాసం.


🌿ఈ తిరుమీయచ్చూర్ ఆలయంలోని యమధర్మ రాజుని , శనీశ్వరుని అభిషేకించి , భక్తితో పూజిస్తే తాము పోగొట్టుకున్న విలువైన

వస్తువులు మరల దొరికి శుభాలు 

జరుగుతాయని భక్తుల విశ్వాసం. 


🌸ఏలిన నాటి శని దోషానికి , ఇతర

సమస్యలకు

యీ  ప్రదేశంలో  విముక్తి

కలుగుతుంది..🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat