గురుతి పూజ అనగా ఏమిటి?

P Madhav Kumar
శబరిమలై మకరవిళక్కు ఉత్సవం ముగిసిన పిమ్మట చివరిదినం ఈ గురితిపూజను నిర్వహిస్తారు. మండల మకర మహోత్సవ వేళలో కోట్లాది జనులు శబరిమలకు వచ్చి శ్రీస్వామివారిని దర్శించి వెళ్ళియుందురు. ఆ దృష్టిదోషము తొలగుటకును స్వామివారి పరివార దేవతలను సంతృప్తి పరచుటకొరకును, దుర్దేవతల ఆగడం తొలగుటకును ఈ గురుతి పూజ చేసెదరు. భారీగా అన్నం వండి ఎర్రటి రంగుల పొడులు అందులో కలపి పదునెట్టాంపడి ముంగిట యుంచి, గుమ్మడికాయ పగులకొట్టి, నిమ్మకాయ బలియిచ్చి, స్వామివారి కత్తితో ఆ అన్నమును కోసి ఆ పరిసర ప్రాంతమంతయు విసరెదరు. ఆ ప్రాంతము చుట్టూ తిరుగులాడు చుండు దుర్దేవతలు ఈ హవిస్సును తీసుకొని వెళ్తారన్నది ప్రతీతి.




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat