మాఘ మాసం కృష్ణ పక్షం విజయ ఏకాదశి.

P Madhav Kumar

 


యుదీశ్తర మహారాజు శ్రీ కృష్ణ భగవానుని తో ఇలా అన్నాడు *" ఓ వాసుదేవ ,ఈ *మాఘ మాసం కృష్ణ పక్షం* *లో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరగా "*


*శ్రీ కృష్ణ పరమాత్మ :*


ఓ యుదిశ్తర , ఈ మాఘ మాసం లో వచ్చే టువంటి ఏకాదశి పేరు *"విజయ ఏకాదశి"*. ఈ ఏకాదశి ని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది , మరి వారి పాపాలు కూడా తొలిగిపోతాయి . 


ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను , అప్పుడు బ్రహ్మ ఈవిధంగా చెప్పనారంబించెను .


ఓ నారద మహా ముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు , నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము . ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది . ఈ పేరు లో చెప్పిన విదంగానే ఈ ఏకాదశి వ్రతం అనీ విజయాలను చేకూరుస్తుంది సందేహమే లేదు. 


శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు , సీత , లక్ష్మనుని తో కలిసి పంచవటి లో నివసించేవాడు . రావణడు సీతాదేవి ని అపహరించినప్పుడు శ్రీ రాముడు దిగులుతో అన్ని కొలుపొయినవాడి లా గుండెను సీతా దేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినది వివరం అడుగగా , జటాయువు సీతమ్మ ని రావణాసురుడు ఎలా అపహరించాడో , సీతామాతని కాపాడబోయి రావణుడు చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరనిస్తాడు . శ్రీ రాముడు తన సీతా కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువి కి వైకుంట లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు . సీతా దేవిని వెతికే క్రమం లో కబందుడిని సంహరిస్తాడు . 


అటు తరువాత శ్రీ రాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు . సుగ్రీవుడు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తాయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకటానికి లంక కి వెళ్లి వెతకమని ఆగ్న్య . హనుమ లంక లో సిత్తమ్మని అశోకవనం లో చూసి శ్రీ రాముని ముద్రికని చూపి, అయన గుణగణాలను కొనియాడి , హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తెసుకుని తిరిగి శ్రీ రాముని వద్దకు వచ్చి వివరించెను . శ్రీ రాముడు సుగ్రీవుని సహాయం తో లంకా నగరానికి చేరుకునే సముద్రానికి చేరుకొని ఆ సముద్రాని దాటడం అంత సులువు కాదని గ్రహించి , లక్ష్మణునితో ఎలా అన్నాడు , ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదె ఇప్పుడు మనం ఏమి చెయవలను 


అందరిలోకి మంచివడివైన శ్రీ రామ , బలదలబ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగరలోనే ఉన్నారు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యమ్ ఏమిటో కనుకుందాం . అయన మాత్రమే మనకి ఈ సమయం లో సహాయపడగలరు నాయి సెలవిచ్చి అయన దగ్గరకి బయల్దేరారు . 


బలదలబ్య ఋషి ని చేరుతూనే నమస్కరించి కుసలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు . 


*బలదలబ్య* 


శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము , దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లబిస్తుంది . 


ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి , లేదా, బంగారం ఏది లేకపోతె మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీలు పోసి నవధాన్యాలు , పసుపు కుంకుమ వేసి , కుండకి తోరణాలు కట్టి అందంగా అలకరించలి . దీనినీ శ్రీమన్నరాయణ దగ్గర పెట్టాలి . మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తీ శ్రద్ధలతో శ్రీమన్నరాయణు కి పూజ చేసి , ఈ కుండకి కి పసుపు కుంకుమ , గంధం , అక్షింతలు , వేసి నమస్కరించి ఉపవసింఛి రాత్రి కి జాగరణ చేయాలి . మరునాడు ద్వాదశి తిథి రాగానే మల్లి అ కుండకి పూజ చేసి ఏదయినా ఒక నది లో కలిపేయాలి . తరువాత ఉత్తముడయిన బ్రాహ్మణునికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి . ఈ విధం నువ్వు ని సేన ఉపవాసం చేస్తే తప్పకుండ విజయం లబిస్తుంది అని చెప్పను . 


శ్రీ రామచంద్రుడు బలదలబ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు . ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికీ వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది . 


ఓ నారద ఈ విధంగ ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకం తో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చెండాలమయిన పాపాలు అయిన హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంఠ లోక ప్రాప్తి లబిస్తుంది . 


అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో , ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం లబిస్తుంది అని చెప్పేను .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat