గంగావతరణం(8)

P Madhav Kumar
1 minute read


ఓం
గంగావతరణం(8)

క్రోధాగ్నికి భస్మైపోయారు కనుక వీరికి ఉత్తమ గతులుండవు. వీరు ఊర్ధ్వలోకాలకు, భూలోకానికి మధ్య అంతరిక్షంలో ఎక్కడో వెళాడుతుంటారు. నా తండ్రి సమానులైన వీరికి ఉత్తమ గతులు కల్పించడం కోసం నేను తర్పణం విడుస్తానని అంశుమంతుడు దగ్గరలో నీరు లేకపోతే చాలా దూరం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.

అంతలో అంశుమతుడికి మేనమామైన గరుత్మంతుడు కనిపించి, వారిది మామూలు మరణం కాదు, మహాపురుషుడైన కపిల మహర్షి కోపానికి బలైపోయారు. వీరికి మామూలు జలంతో తర్పణాలిస్తే ప్రయోజనం ఉండదు. హిమవంతుడి కూమార్తైన గంగమ్మ యొక్క జలంతో తర్పణలిస్తే తప్ప విముక్తి లభించదు. ఈ 60,000 సగరుల భస్మరాశుల మీది నుండి గంగ ప్రవహించాలి. అప్పుడే వీరికి ఉత్తమ లోకాలు లభిస్తాయి అన్నాడు.

ఆ మాటలు విని, గుర్రాన్ని తీసుకుని యజ్ఞప్రదేశానికి వచ్చి, సగర చక్రవర్తికి ఈ వార్త చెప్పి, యజ్ఞాన్ని పూర్తిచేశాడు. తన కూమారులకు ముక్తిని కల్పించడానికి సగరచక్రవర్తి చాలా ప్రయత్నం చేశారు కానీ ముసలివారవడం వలన మరణించాడు.

ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. తన పితరులకు విముక్తి కల్పించడానికి గంగను తీసుకురావాలనుకున్నాడు, కానీ తపస్సు చేయలేకపోయాడు, సగరులకు ముక్తిని కల్పించలేకపోయాడు, కాలక్రమంలో మరణించాడు.

తరువాత దిలీపుడు రాజయ్యాడు. చాలా గొప్పవాడు ఈయన. ఈయన ప్రయత్నం చేశాడు కానీ తపస్సు చేయలేదు, గంగను భూమికి తీసుకురాలేదు.

దిలీప మహారజు తరువాత భగీరధుడు రాజయ్యాడు. ఆయన రాజువుతూనే తన పితృదేవతలను ఎలా ఘొర నరకాలనుండి ఎలా రక్షించాలి, వారికి ఎలా ముక్తిని కల్పించాలని ఆలోచించి, మహారాజు అవ్వగానే రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి బ్రహ్మదేవుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు.

ఎలా తపస్సు చేశాడు? రెండు చేతులు పైకెత్తి, తనకు నాలుగు వైపులా అగ్నిహోత్రాలను పెట్టుకుని, కన్నులు మూయకుండా సూర్యుడినే చూస్తూ, నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ, ఇంత బాధ అనుభవిస్తున్నా, తన మనసును, శరీరాన్ని జయించి, వాటి గురించి ఆలోచించకుండా, బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు.

to be continued..............

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat