క్షీరసాగర మదన సమయాన రాక్షసులు, దేవతలు ముందుగా గణపతిని
ప్రార్థించకుండా అమృతం కొరకు పాల కడలి చిలకడం ప్రారంభించినారు. లక్ష్మీదేవి క్షీర సాగర మధములో ఉదయించగా వినాయకుడు తీసుకుని వెళ్ళిపోగా బ్రహ్మా ఇంద్రాది దేవతలు లక్ష్మీదేవిని విష్ణువు భార్యగా నిర్ణయించవలసి వున్నదని వినాయకునికి విన్నవించగా తనకు లక్ష్మీ అంశలలో భార్య కావాలి అని కోరగా బ్రహ్మదేవుడు, సిద్ది లక్ష్మి, బుద్ది లక్ష్మి అను ఇద్దరు భార్యలను గణపతికి ప్రసాదించెను. ఆనాటి నుండి గణపతి 'లక్ష్మీ గణపతులు'గా పేరు గాంచెను.
