కాళిదాసుగర్వభంగం

P Madhav Kumar

💐 🙏 *కాళిదాసుగర్వభంగం* 🙏🏼💐

*మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.*

*మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.*

*బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.*

*ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.*

*ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది.*

*నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...*

*‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు:*

*‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?*

*పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.*

*అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...*

*‘మీరు అసత్య మాడుతున్నారు.*

*ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.*

*వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.*

*అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...*

*‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.*

*ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు.*

*అయినా ఆ బాలిక కనికరించదు.*

*‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’*

*అని అడుగు తుంది. బాలిక.*

*‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు.*

*‘మళ్లీ అసత్య మాడుతున్నారు.*

*బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.*

*మీరేమో అలిసి పోయారు కదా.*

*ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.*

*వారే సూర్యచంద్రులు!*’

*అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.*

*దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి..*

*‘మాతా నీళ్లు ఇవ్వండి.*

*దాహం తో చనిపోయేలా ఉన్నాను..’*
*అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.*

*లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...*

*‘మీరెవరో సెలవివ్వండి...*

*నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా...*

*‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు.*

*‘మీరు అసత్యం చెబుతున్నారు.*

*ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.*

*ఒకటి ధనం, రెండోది యవ్వనం.*

*ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది.*

*కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు.*

*కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.*

*ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.*

*ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.*

*ఓపిక నశించిన కాళిదాసు..*

*‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు.*

*ఆ అవ్వ నవ్వుతూ...‘*

*ఇదీ అసత్యమే.*

*ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.*

*ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.*
*ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది.*

*ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.*

*ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు_*

*ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది._*

👉 *‘కాళిదాసా..!* *విద్యతో* *వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!*

*కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’అని జలమును అనుగ్రహిస్తుంది*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat