శ్రీ ఆంజనేయ మహత్యం*

*శ్రీ ఆంజనేయ మహత్యం* 
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*విజయుని చరిత్ర:-*

          శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను, పరాశర మహర్షి ,మైత్రేయునికి తెలిపాడు .అందులో విజయుని చరిత్రను, ముందుగా తెలియ జేస్తున్నాను .
త్రేతాయుగంలో ” చంద్ర కోణం” అనే ప్రసిద్ధి చెందిన నగరం వుంది . దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు.
 అతడు బలశాలి , శత్రు సంహారకుడు ,సమర్ధుడు .
 యుద్ధ విద్యలో చేయి తిరిగిన వాడు . నాలుగు దిక్కులలో వున్న రాజ్యాలన్నీ జయించి, స్వాధీనం చేసుకోవాలనే, బల మైనకోర్కె, అతనికి కలిగింది.
 రాజ్యాన్ని కుమారులకు
 అప్పగించి,పెద్ద సైన్యంతో  ,
జైత్రయాత్రకు బయల్దేరాడు.
 కొంత ప్రయాణం చేసిన తరు వాత, ”గర్గ మహర్షి ”ఆశ్రమం చేరాడు . సైన్యాన్ని దూరంగా వుంచి , తానొక్కడే మహర్షిని సందర్శించాడు . భక్తీతో ఆయనకు నమస్కరించి, నిలుచున్నాడు . ఆతని శ్రద్ధకు, భక్తికి, సంతోషించిన గర్గుడు, కుశల ప్రశ్నలతో, స్వాగతం పలికి , ఆతిధ్యం ఇచ్చాడు.


 గర్గముని- రాజైన విజయుడి తో , ”రాజా !స్వాగతం. ఎక్కడి నుంచి బయల్దేరావు ?ఎక్కడి దాకా ప్రయాణం ”? అని అడిగాడు . దానికి రాజు విజయుడు, వినయంతో, ”మహర్షీ ! మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే వుంది .ఇంటి నుంచే బయల్దేరాను . సర్వ దిక్కులలో వుండే, రాజ్యాలన్నీ జయిoచాలనే కాంక్షతో, దిగ్విజయ యాత్రకు బయల్దేరాను . నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి, మీ ఆశీర్వాదం ఇవ్వండి.  నాకు పని సానుకూలం ఆవటానికి, ఇంకా ఏదైనా ఉపాయం వుంటే, సెలవివ్వండి ”అని విన్నవించాడు. 


గర్గమహర్షి సంతోషించి, ”నీ కోరిక మంచిదే . అయితే ఏ 
 పనికైనా, దైవ అనుగ్రహం కావాలి . అప్పుడే ఆ కోరిక 
 నెరవేరుతుంది. సఫల 
 మనోరధుడవై ”విజయుడు" అనే పేరు సార్ధకం చేసుకో.
 ఎన్నో మంత్రాలున్నాయి. కాని శీఘ్రంగా ఫలసిద్ధి నిచ్చేది మాత్రం, ”హనుమన్మంత్రం" ఒక్కటే . అది భక్తులకు అందు బాటులో వుంటుంది. యుద్ధంలో,  జయాన్ని నీకు అందిస్తుంది. నేను నీకు ఆ మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను . దాన్ని త్రికరణ శుద్ధిగా ,భక్తీ , శ్రద్ధలతో జపించు . నువ్వు అనుకొన్నది సాధించ గలుగుతావు ”అని చెప్పి , బీజ సహితంగా, మంత్ర ,ఉద్ధార, న్యాస పూర్వకంగా అష్టాక్షరీ హనుమంమంత్రాన్ని గర్గుడు , విజయునికి ఉపదేశించాడు.


గర్గాశ్రమంలోనే విజయ మహారాజు వుండి , ఆయన సన్నిధిలోనే మంత్రంమీద , మంత్ర దైవం అయిన ఆంజనేయుని మీద, సమాన భావం తో విశ్వాసము,
 గౌరవము చూపించి ,108 సార్లు జపించాడు . శ్రీఆంజనేయుడు, పరమ ప్రీతి చెంది , సుగ్రీవాదులతో కలిసి, అక్కడ ప్రత్యక్షం అయాడు.
 ఆనంద బాష్పాలు కారుతుండగా , విజయుడు ,
వాయునందనుడికి, సాష్టాంగ నమస్కారాలు చేశాడు.
 నాలుగు ముఖాలు కల బ్రహ్మ ,ఆరు ముఖాల కుమార స్వామి , వెయ్యి ముఖాల ఆదిశేషుడుo ఆశ్చర్యపడేట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు, హనుమను, పెక్కు విధాల కీర్తించాడు . అనేక స్తోత్రాలు చేసి, భక్తిని ప్రకటించుకొన్నాడు.

హనుమ భగవానుడు సంతృప్తి చెంది, విజయునితో ”నీ యడల ప్రసన్నుడిని అయాను. నీకు శుభం కలుగు తుంది. ఏదైనా వరం ఇస్తాను. కోరుకో” అన్నాడు. మనసులో సంతోషించి , దోసిలి ఒగ్గి, వాయుసుతునుకి మళ్ళీ నమస్కరించి ” అతి తక్కువ కాయoలోనే నాకు దర్శనం ఇచ్చి , నన్ను కృతార్దుడిని చేశావు. మహా బలవంతా! ఆంజనేయా ! నీ దర్శనమే కోరికలన్నిటినీ, తీరుస్తుంది.
 అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు.
 తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు . నీ కృప అపారం .
 నా మనసులో, నాలుగు దిశలు జయిoచాలనే కోరిక వుంది . నీ అనుగ్రహం కావాలి. దానిని తీర్చి , నాకు మేలు చేయి ” అని ప్రార్ధించాడు.


 ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై ,
వాత్చల్యంతో ”రాజా !నాలుగేమిటి ? పది దిక్కులను జయించి, విజయుడు అనే పేరు సార్ధకం చేసుకో.
అయితే , ఈ జన్మలో నీ కోరిక తీరదు . రాబోయే ద్వాపర యుగాంతంలో ఈ కోరిక నెర వేరుతుంది. అప్పుడు నువ్వు స్వర్గాదిపతి దేవేంద్రుని కుమారుడివై జన్మిస్తావు .
 శ్రీకృష్ణుని సారధిగా చేసుకొని , అన్ని దిక్కులను జయిస్తావు.
 కురు క్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు.
అప్పుడు నీ రధానికి, నేను జెండాపై అధివసించి ,నీకు విజయం చేకూరుస్తాను.

 నేను వుండే ఆ జెండాను, ”కపిధ్వజం" అంటారు. నిన్ను ”కపిధ్వజుడు ”అని పిలుస్తారు”అని, వరం ప్రదానం చేసి, మారుతి అంతర్ధానం అయాడు. హనుమ చెప్పిన మాట విని, విజయమహారాజు
 తన జైత్ర యాత్రను విరమించు కొని , గర్గ మహాముని ఆశీస్సులను అందుకొని ,
 ఆయనకు నమస్కరించి,
 మళ్ళీ రాజా దానికి చేరు కొన్నాడు . .
రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా, ప్రజా క్షేమంగా పరిపాలించి,
 చివరికి స్వర్గ లోకం చేరాడు.

🍁🍁🍁🍁🍁🍁

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!