కృష్ణుడు మరియు ఒక దొంగ కథ

P Madhav Kumar



బ్రాహ్మణుడు  ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవతం ప్రసంగిస్తున్నారు.ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, మూల దాక్కున్నాడు


భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల ఘట్టం జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము  అని అనుకున్నాడు. దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డా


బ్రాహ్మణుడు భయపడి ‘నా దెగ్గర ఏమీ  లేదు ‘ అని అన్నారు.దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ  పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దెగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు


బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దెగ్గరకి రోజూ  ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు.  ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పా


దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు   వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లలి దెగ్గిరకి వెళ్ళాడు దొం


బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నా


ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది.అతను వెళ్లి బాల కృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు. కృష్ణుడి స్పర్శ తగల గానే, దొంగ చేసిన పాపములన్నీ  కరిగి పోయాయి. “ఎంత అదృష్టవంతుడో కదా దొంగ ! “బాల కృష్ణుడిని ,ఆ దొంగ అమ్మాయకంగా ,”ఎవరు నువ్వు?” అని అడిగాడు. అమాయకంగా కృష్ణుడు ‘నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది, నన్ను వదిలి వెళ్ళిపో ‘ అన్నాడు. దొంగ, ‘దురాచానాలతో నిండి ఉన్న నా మనస్సు వల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను.  నన్ను వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకు ‘ “అని ప్రాతిధేయ పడ్డాడు.అప్పుడు బాల కృష్ణుడు, దొంగకి అతను  వచ్చిన పనిని గుర్తుచేసి, తను వేసుకున్న నగలన్నీ  ఇచ్చాడు. అప్పుడు దొంగ, ‘ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కోప్పడదా ?’అనిఅడిగాడు. దానికి కృష్ణుడు  ‘ఏమి కోప్పడదు , ఎందుకంటే నా దెగ్గర  చాలా నగలు ఉన్నాయి


 నేను నీకంటే పెద్ద దొంగని. కాని, నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా , ఎవ్వరు పట్టించు కోరు. నన్ను ప్రేమగా ‘చిత్తచోరా’ అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఇంకోటి ఏమిటి అంటే, నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు దానిని నేను దొంగిలించి తీసుకెళ్తున్నాను “ అని జవ్వాబు చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి మాయమైపోయారు. తరువాత చుస్తే, దొంగ భుజం  మీద నగలు నిండి ఉన్న ఒక మూట  ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పా


ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన  చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి  వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని  అనుగ్రహించావు ,కనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని నిరాశతో బాధపడ్డాడు.అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘నీవు భాగవత పురాణమును  కేవలము ఒక కథగా చదివావు, కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం ,సమ్పపొర్న శరణాగతి ఉన్న చోటే  నేను ఉంటాను

నీతి: 

పురాణాలను  చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat