శ్రీరాముని యొక్క ధర్మాచరణ

P Madhav Kumar


ధర్మాచరణ గురించి రామాయణం లో వాల్మీకి రెండు గుణాలు చెప్పారు. 


ఒకటి: “ధృతి” రెండు: “నియమం”.


 శ్రీరాముడు అడవులకి వెళ్ళే ముందు తల్లి కౌసల్యకి నమస్కరించాడు. 


ఆమె “ధర్మ మార్గం లో నడువు” – అని ఉపదేశించలేదు.


 రాముడు ధర్మావతారం. ఆయన స్వభావం ధర్మరక్షణ. “ధర్మంచర” అని ఆయనకొకరు చెప్పబని లేదని తల్లికి తెలుసు.


 అందుకని ఆమె ఇలా ఆశీర్వదించింది. “నీవు ధృతి (ధైర్యం), నియమాలతో ఏ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావో, ఆ ధర్మమే నిన్ను రక్షించు గాక!”


 ప్రతీ భారతీయునికి రాముని శీలమే ఆదర్శం.


 రామనామమే మహామంత్రం. మనలను నేడు పీడిస్తున్న అన్ని జబ్బులకి అదే మందు.


ధర్మ మార్గమే నిజమైన భక్తి యని రాముఁడు

నమ్మాడు .  


ధర్మమే మనకూ , మన కుటుంబాలకు , మన సమాజానికి , హితకారియై ఈశ్వరానుగ్రహాన్నిస్తుంది .


 థర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని తప్పకుండా రక్షిస్తుంది. 


అందుకే రాముడికి సీతకంటే కూడా , ధర్మం అంటేనే ఇష్టం.


 ఇదే థర్మాన్ని

పాటిస్తే మనమూ దేవునిపట్ల నిజమైన భక్తి కలిగియున్నవారమవుతాము.


శ్రీరాముడు ధర్మ నిష్టా గరిష్టుడు. ఏ కాలంలో నైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా , ధర్మలుబ్ధము కాకూడదు, .అని రాముఁడు విశ్వశిస్తాడు. 


దానికి ఉదాహరణ ఒకటి.  


శ్రీరాముఁడు వనవాసంలో యుండఁగా , భరత, శత్రుఘ్నుల వల్ల తన పితృ వియోగ వార్త

తెలుసుకుని , చింతాక్రాంతుడై విలపించి ,

తనకు విహిత కర్మ అయినటువంటి పితృకర్మ

ఆచరణకొరకు , ఆపద్ధర్మముగా అక్కడ వన

వాసములో లభించినటువంటి కంద మూలా దులతో , గతించిన తన తండ్రి దశరథుడికి ,

శ్రాద్దము ఆచరించి , మందాకినీ నది వద్ద

పితృదేవులకు ఉదక తర్పణాలు ఇచ్చి , పితృ

దేవతలకు సద్గతి కలుగచేశాడు.  


రామాయణంలోని అరణ్యకాండ మనకు

ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. సీతా వియోగంలో ఉన్న శ్రీరాముఁడు ఆమె కోసం

వెతుకుతూ , నదులను , చెట్లను, పుట్టలను ,

కొండలను , గుట్టలను, లేళ్లను , కుందేళ్ళను ,

ఇలా కనిపించిన చరాచర జీవరాశి నంతటిని

సీత గురించి ప్రశ్నిస్తాడు. ఆయనస్థితిని చూసి

తట్టుకోలేక , లేళ్ళు యధాశక్తి ప్రయత్నించి ,

ఆయనకు రావణ దుర్మార్గాన్ని గురించి సూచించాయట. పర్ణశాలవైపు చూడటం,

ఆపై దక్షిణంగా పరిగెత్తడం, ఆగి ఆకాశంవైపు

చూసి కంటనీరు పెట్టడం ,ఇలా చేస్తున్నాయట.


ఇది గమనించిన రాముడికి పర్ణశాలలో ఉన్నసీతను , ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోయి ,

ఆకాశమార్గంలో దక్షిణదిశగా ప్రయాణించాడని

అర్థమైందిట . 


ఈ స్థితిని వర్ణిస్తున్న వాల్మీకిశ్లోకం , దీనస్థితిలో పడిన ప్రతి సత్పురుషునికి

ఒక ఓదార్పు నిస్తుంది..



” సుపంధానంతు గచ్ఛన్తం

  తిర్య o చొపి సహాయతే

  కుపంధానంతు గచ్ఛన్తం

  సోదరోపి విముంచతి “


అంటే మంచి మార్గంలో పయనిస్తున్న వ్యక్తులకు , పశుపక్ష్యాదులు కూడా సాయం

చేస్తాయట . 


 అందుకే రామునికి లేళ్లు, జటాయువు, సంపాతి , వానరులు కూడా

సాయం చేశారు . దుర్మార్గంలో నడిచే వ్యక్తిని ,

సోదరుఁడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడుట.

రావణుని విషయంలో సరిగ్గా అదే జరిగింది .



ఇదే వాల్మీకి మహర్షి అరణ్యకాండలో , మానవాళికి , చెప్పిన మహాపదేశం.


 రామాయణ కాలానికే కాదు , ఏ కాలానికైనా

ఏ పరిస్తితుల్లోనైనా వర్తించే మాటలివి .


అందుకే కొండలున్నంతవరకు , నదులు ప్రవహిస్తున్నంత కాలమూ , రామాయణం

ఉంటుందని , సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉద్ఘాటించిన నగ్నసత్యం.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat