తల్లిదండ్రుల గురించి ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది

P Madhav Kumar



● ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి.

● ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి.

● ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన 

   గోదానము చేసిన పుణ్యం వచ్చును. 

● సత్యం తల్లి- జ్ఞానం తండ్రి. 

● పదిమంది ఉపాధ్యాయులకంటే 

   ఆచార్యుడు గొప్పవాడు 

   వందమంది ఆచార్యులకంటే 

   తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు 

   గొప్పది జన్మనిచ్చిన తల్లి. 

● తల్లిదండ్రులకు సేవ చేస్తే ఆరు సార్లు భూప్రదక్షిణ 

   చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన 

   ఫలమూ, వంద సార్లు సముద్ర స్నానము 

   చేసినఫలమూ దక్కుతాయి.   

● ఎవరు మాతృదేవతను సుఖముగా ఉంచరో, 

   సేవించరో, వారి శరీర మాంసాలు, శునక 

   మాంసము కన్నా హీనం.

● ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ 

   కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన, లక్ష గోవులు 

   దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలుచేసినా,

   ఆ పాపం పోదు.  

● తను చెడి, తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని 

   అసహ్యించుకున్నా తప్పులేదు. చెడునడతతో 

   ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని  

   ధర్మ శాస్త్రం చెబుతోంది. 

● తల్లిని మించిన దైవం లేదు.గాయత్రిని మించిన 

   మంత్రం లేదు. 

   శుభం సర్వేజనా: సుఖినో భవంతుసమస్త 

   సన్మంగళాని భవంతు.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat