*భగద్గీత, వేదాంతం, మనకు బోధించేది ఏమిటి?*


త్వమేవాహమ్‌**


కన్నతల్లి కడుపులోంచి బయటపడి,


తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణంనుంచి, 


పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు,


ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే


నేను = నేనే.


ఈ నేను

 

ప్రాణశక్తి అయిన "ఊపిరి" కి మారుపేరు.


ఊపిరి ఉన్నంతదాకా *నేను* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది.


జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో 


ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. 

మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.


ఈ *నేను* లోంచే, *నాది* అనే భావన పుడుతుంది.


ఈ *నాది* లోంచి  


1. నా వాళ్ళు, 

2. నా భార్య, 

3. నా పిల్లలు, 

4. నా కుటుంబం, 

5. నా ఆస్తి, 

6. నా ప్రతిభ, 

7. నా ప్రజ్ఞ, 

8. నా గొప్ప...


అనేవి పుట్టుకొచ్చి,


చివరికి, 


ఈ *నేను* అనే భావన

 

భూమండలాన్ని కూడా మించిపోయి,

ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, 

నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి, 

*అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


*అహం* అనే మాయపొర కమ్మేసినస్థితిలో 


ఈ *నేను* *నేనే సర్వాంతర్యామిని* 

అని విర్రవీగుతుంది.


నాకు ఎదురేలేదని ప్రగల్భాలూ పలుకుతుంది.


1. పంతాలతో 

2. పట్టింపులతో, 

3. పగలతో

4. ప్రతీకారాలతో 


తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.


1. బాల్య, 

2. కౌమార, 

3. యౌవన, 

4. వార్ధక్య 

దశలదాకా విస్ఫులింగతేజంతో విజేతగా నిలిచిన

*నేను* అనే ప్రభ, 


ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.


వందిమాగధులు ఎన్నో ప్రశంసలు చేసిన శరీరం, కట్టెలా మిగులుతుంది.


సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం, నిస్తేజంగా పడిఉంటుంది.


సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో, తులతూగిన *నేను* చుట్టూచేరిన, బంధుమిత్ర సపరివారపు జాలిచూపులకు కేంద్రబిందువుగా మారుతుంది.


కడసారి చూపులకోసం,

కొన్ని ఘడియల పాటు ఆపిఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.


మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.


మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి, బూడిద అవుతుంది.


*1.నేనే* శాసనకర్తను, 


 *2.నేనే* ఈ భూమండలానికి అధిపతిని, 


*3.నేనే* జగజ్జేతను... 

అని మహోన్నతంగా భావించిన


*నేను* లేకుండానే, 


మళ్ళీ తెల్లవారుతుంది. 


రోజు మారుతుంది.


*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను* కథ 


అలా సమాప్తమవుతుంది.


అందుకే ఊపిరి ఆగక ముందే 

*నేను* 

గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.


చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది,

శ్మశాన వైరాగ్యం మాత్రమే. 

అది శాశ్వతం కానే కాదు.


నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే,


పరిపూర్ణమైన 'వైరాగ్యస్థితి' సాధ్యమవుతుంది.


వైరాగ్యం = (అంటే) అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. 


దేని మీదా మోహాన్ని కలిగిఉండకపోవడం.


తామరాకు మీద నీటిబొట్టులా జీవించగలగడం.


స్వర్గనరకాలు ఎక్కడోలేవు. 


మనలోనే ఉన్నాయి.


మనిషికి, ఆత్మదృష్టి నశించి, బాహ్యదృష్టితో జీవించడమే (అంటే) = నరకం


అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం (అంటే) = స్వర్గం.


ఈ జీవనసత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.


1. నిజాయతీగా,

2. నిస్వార్థంగా, 

3. సద్వర్తనతో,

4. సచ్ఛీలతతో 

5. భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే

*వేదాంతసారం*.


*అహం బ్రహ్మాస్మి* (అంటే) =

*అన్నీ నేనే*.

అనే స్థితి నుంచి

*త్వమేవాహమ్‌* (అంటే) = *నువ్వే నేను* 

అని 


భగవంతుడిపట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్యస్థితిని చేరుకోగలిగితేనే


*మానవజన్మకు సార్థకత*.


🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!