శ్రీకాళహస్తి గుడి దర్శించుకున్నాకా మరే గుడికీ వెళ్లకూడదు ... ఏందుకు...?!!*

P Madhav Kumar

 *

*ఎందుకో తెలుసా ? దానివెనుక ఉన్న కారణం ఇదే...🌹*


🌸తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు.


🌸పాపనాశనం .. కానిపాకం .. శ్రీకాళహస్తి ఇలా వరుసగా ఒక్కో ఆలయాన్ని దర్శించుకుంటారు.

అయితే తిరుమల చుట్టూ ఉన్న ఆలయాల్ని సందర్శించేప్పుడు అన్ని గుళ్లను దర్శించుకున్నాక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకోవాలి.


🌸అదే చేస్తుంటారు కూడా.. కాని శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరే ఇతర ఆలయాన్ని దర్శించ కూడదని, నేరుగా ఇంటికే వెళ్లాలని అంటుంటారు.

శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు ? వెళితే ఏమవుతుంది ? నేరుగా ఇంటికే ఎందుకే వెళ్లాలి.


🌸గాలి , నింగి , నేల , నీరు , నిప్పు ఇవే పంచభూతాలకు ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి.

అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలి స్పరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడనదే ఆచారం.


🌸అందులో నిజం లేకపోలేదు.

సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది.

శ్రీకాళహస్తి లోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెపుతారు ఇక్కడి పూజారులు.


🌸కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లిన దోష నివారణ ఉండదనేది అక్కడి పూజరులు చెపుతున్నారు.


🌷గ్రహణాలు .. శని బాధలు ..🌷


🌹 పరమశివుడుకి ఉండవని. మిగితా అందరి దేవుళ్లకి శని ప్రభావం. గ్రహణ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు.


🌸దీనికి మరోక ఆధారం .. చంద్రగ్రహణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు.

గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు . కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది.


🌸అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవం దర్శనం అవసరం లేదు అంటున్నది శాస్త్రం.


🙏హరహర మహాదేవ శంభోశంకర🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat