*పంచాక్షరీ మత్రం విశిష్టత*

P Madhav Kumar



*భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం*

*వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం*

*పాశాంకుశాభయ వర ప్రద శూల పాణిం*

*వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం*


*సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము (తాడు), అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము...*


*ఓం నమః శివాయ...*


*శివ పంచాక్షరీ మంత్రం.. మానసిక ప్రశాంతతకు మూలం! ఓం ‘నమఃశివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమఃశివాయ’ అనే మంత్రం లిఖితపూర్వకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు.*


   

*ఓం నమఃశ్శివాయ.. *

*ఇదే పంచాక్షరీమహా మంత్రం.*

*ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం.*


*దీని ఉచ్ఛారణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు.*

*ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి.*

*ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు.*


*‘న, మ, శి, వ, య. మంత్రం’… ‘ఓం’ కారంతో ప్రారంభం అవుతుంది.*


*ఓం... మహాబీజాక్షరం.* 

*దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి.*


*‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్నా ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు.*

*న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు.*


*ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెలకుంటుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.*


*ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది.*


* ‘న’ భూమికి సంబంధించిన భాగాలను,*

 *‘మ’ నీటికి సంబంధించిన భాగాలను,*

 *‘శి’ అగ్నికి సంబంధించిన భాగాలను,*

*‘వ’ గాలికి సంబంధించిన భాగాలను,*

*‘య’ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి.*


*మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు.*

*అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.*


*భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్ఛరించినా తగినంత ఫలం లభిస్తుంది.*

*శివభక్తుడైన సౌనందగణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆయనను సత్కరించి, వచ్చిన కారణమేంటని అడిగాడు.*

*తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు.*



*దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు.*

*వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి.. “ఓ జనులారా! ఇది ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రం. దీనిని ఉచ్ఛరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయ”ని తెలిపారు. ముని ని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట.*


*ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు. కానీ భక్తితో ఉచ్ఛరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది.*


*అర్థయుక్తంగా ఉచ్చరిస్తే …. ‘అధికస్య అధికం ఫలమ్‌’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.*✍️

          ఓం నమః శివాయ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                   

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat