మల్లికాపురత్తమ్మ దగ్గర కొబ్బరి కాయను దొర్లించుటలో పరమార్తము ఏమిటి ?


మాల్లికాపురత్తమ్మ దగ్గర కొబ్బరి కాయలు దొర్లించుటలో పరమార్తము , ఆధ్యాత్మిక భావన దాగి ఉన్నది. నెయ్యి నింపిన కాయ అయ్యప్పకు అర్పించి , నేయ్యి నింపని కాయను అనగా మూడు కన్నులు కల నారికెళము లో స్వచ్ఛమైన భగవత్ప్రసాదిత జలము ఉండును. ఈ కాయను పగులకొట్టరాదు. మనలో దాగి ఉన్న 18 భావనలను టెంకాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలో భావన.


      మాలికాపురత్తమ్మ దేవి సాక్షిగా నా లోని కామ , క్రోధ , లోభ , మోహ , మద మాత్సర్యాలను సదరు కాయలో భందించి , ఇక్కడే వదిలి పెట్టివెళుతున్నానని , చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గుణులై , పరిశుద్ధులై వెళ్లడం అనేది అంతరార్థం.


     నారికెళము ఈశ్వర విష్ణు సంబంధమైనది. టెంకాయ పై నిలువు చారలు విష్ణు రూపమైతే, టెంకాయ పై ఉన్న మూడు కన్నులు శివరూపం.


     టెంకాయలోని *"అహం"* అనే నీటిని తీసి , హరిహరులకిష్టమైన నేతిని అందు నింపి , స్వామికి ఆ నెయ్యే నా జీవమని అభిషేకమునకు ఇస్తారు. ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో(నెయ్యి) మనకిస్తాడు. పిదప జీవత్సవమైన కాయ *(కాయము , అనగా మన శరీరం)ను* మంటల్లో వేసి కాలుస్తారు. 


     శబరి యాత్ర చేసి వచ్చువారు పుణ్యజీవులై , పరిశుద్ద శరీరంతో , లోన దుర్గుణాలన్నియు పోగొట్టుకొని సత్సీలురై పరమ పావన రూపులై వస్తారని అర్థం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!