*పార్వతీ_దేవి శివుని యొక్క కంఠం పట్టుకొని విషాన్ని కంఠంలోనే ఆపిన దృశ్య శిల్పం.*

P Madhav Kumar

  ఈ అపురూపమైన  శిల్పం కర్ణాటక లోని  శ్రీకంఠేశ్వర ఆలయం  నంజన్‌గూడ్ అనే ఊరిలోఉంది  కన్నడలో నంజు అంటే విషం అంటే నంజుండేశ్వర అనే పేరు "విషాన్ని తాగిన దేవుడు" (హాలాహల), పాల మహాసముద్రం యొక్క  మధనం తర్వాత  పరమేశ్వరుడు లోకాన్ని రక్షించటానికి తాగాడు. అప్పుడు మాత పార్వతీ విషం స్వామి  ఉదరంలోకి వెళ్ళితే సమస్త లోకాలికీ ప్రమాదం అని (శివుని_ఉదరం (పొట్ట)లోనే అన్ని లోకాలూ ఉంటాయి) పార్వతీ_మాత తన శక్తితో ఈశ్వరుని కంఠాన్ని  చేతులతో పట్టుకుని విషం లోపలికి  వెళ్ళకుండా ఆపింది ,విషం కంఠంలో ఉంది కనుక నీలకంఠుడైయాడు.

       ఆలయంలో శ్రీకంఠేశ్వరుడు లింగ రూపంలోనే ఉంటాడు. 

  నంజన్‌గూడ్ భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్‌కు సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన ఆలయ పట్టణం. కబినీ_నది ఒడ్డున ఉన్న దీనిని దక్షిణ_కాశీ అని కూడా అంటారు. ఇది కర్నాటకలోని మైసూర్‌కి చాలా దగ్గరలో ఉన్న చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం. మైసూర్ చుట్టుపక్కల ఆలయాన్ని మరియు సమీపంలోని ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

 *సర్వేజనాసుఖినోభవంతు*

         ఓం_నమః_శివాయః

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat