సప్తమాతృకలు - ఆవిర్భావం

P Madhav Kumar

 సప్తమాతృకలు

సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని 

స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.


పరాశక్తి ‘సప్తమాతృకలు’గా అవతరించిది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.


*1. బ్రహ్మాణి:* ఈ మాతృమూర్తి.... బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి.


*2. మహేశ్వరి:* శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.


*3. కౌమారి:* కుమారస్వామి శక్తి. 

శక్తి (బల్లెం) హస్త. మయూర వాహనారూఢ.


*4. వైష్ణవి:* విష్ణుశక్తి. శ్రిమాహావిష్ణువువలె గరుడవాహనాన్ని అధిరోహించి, చేతులలో శంఖ చక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.


*5. వారాహి:* హరి అవతారమైన యజ్ఞవరాహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.


*6. నారసిమ్హి:* విష్ణువు ధరించిన నరసింహావతార శక్తి. సింహముఖంతో, నరదేహంతో, అగ్నిమయకాంతితో దివ్యంగా ప్రకాశించే జనని.


*7. ఐంద్రీ:* ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.


     – ఇవీ సప్తమాతృకలు. అంటే 

సర్వదేవతలు అమ్మ రూపాలే. జగదంబ రాక్షససంహారం చేస్తుండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయి.


సప్తమాతృకల ఆవిర్భావం:


బ్రహ్మణి' ... 'మహేశ్వరీ ' ... 'కౌమారి' ... 'వైష్ణవి' ... 'వారాహి' ... 'ఇంద్రాణి' ... 'చాముండి' దేవతలను సప్త మాతృకలు అంటారు. దేవీ పురాణం ... బ్రహ్మవైవర్త పురాణం ... స్కంద పురాణం ... సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి.


పూర్వం జగన్మాత రాక్షసులతో పోరాడుతున్న సమయంలో రాక్షసుల మాయవల్ల తిరిగి అవిర్భవిస్తూ వస్తున్న రాక్షసుల సంహారం కోసం దేవతలు వారి లోని అమ్మవారి శక్తి రూపాలను అమ్మవారికి సహాయంగా యుద్ధానికి పంపుతారు. 

ఏ శక్తి రూపం ఏ దేవత నుండి అవిర్భవించిందో చూద్దాం:


బ్రహ్మ పంపిన బ్రహ్మణి 'హంస' వాహనంపై ... 


విష్ణుమూర్తి పంపిన వైష్ణవి 'గరుడ' వాహనం పై ... 


కుమార స్వామి పంపిన కౌమారీ 'నెమలి' వాహనం పై ... 


వరాహమూర్తి పంపిన వారాహి 'మహిష' వాహనం పై ..     


ఇంద్రుడు పంపిన ఇంద్రాణి 'ఐరావతం' పై ... 


యముడు పంపిన చాముండి 'శవ' వాహనం పై యుద్ధభూమికి చేరుకున్నాయి.


*సప్త మాతృకల వాహనాలు:*


బ్రహ్మణి వాహనంగా 'హంస' .. మహేశ్వరి వాహనంగా 'వృషభం' .. కౌమారి వాహనంగా 'నెమలి' .. వైష్ణవి వాహనంగా 'గరుడ పక్షి' .. వారాహి వాహనంగా 'మహిషం' .. ఇంద్రాణి వాహనంగా 'ఏనుగు' .. చాముండి వాహనంగా 'శవం' కనిపిస్తాయి.


     ఇలా ‘సర్వంశక్తిమయం’   దుష్ట సంహారం చేసి లోకాలను కాపాడిన జగన్మాత స్వరూపలే ఈ సప్త మాతృకలు! మనలోని మనకు తెలియకుండా ఉన్న దుర్గుణాలు, లోభం, అసూయ వంటి గుణాల నుండి మనల్ని రక్షించ మని ఆ తల్లిని ప్రార్ధించాలి, చెడు నుండి మనల్ని కాపాడమని కోరుకోవాలి , *’నాలోని బలం ఆ తల్లి!’* అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి. ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి.🙏


🍁🍁🍁🍁🍁

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat