🔆 ఒకే పానవట్టం పై పంచలింగాల క్షేత్రం 🔆 కర్నూలు జిల్లా : #పంచలింగాల

P Madhav Kumar


👉 శ్రీ పంచలింగాల క్షేత్రం.                                        

💠 దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై అయిదు లింగాలు వెలసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం.


💠 పురాతన కాలం నాటి ఈ ఆలయం సర్పదోషాలను పరిహరించడంలో ప్రసిద్ధి గాంచింది. 


💠 కార్తీక మాసంలో  ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు విచ్చేస్తున్నారు.


🔆*స్థలపురాణం 🔆


💠 పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగాన్ని నిర్వహించాడు. 

దానిఫలితంగా సర్పదోషం సంక్రమించింది. 

ఈ దోష నివారణ కోసం దేశం నలుమూలలా కోటి లింగాలను ప్రతిష్టించాడు. 

ఆ కోటి లింగాలలో చిట్ట చివర ప్రతిష్ఠించినదే ఈ పంచలింగాల క్షేత్రం.


💠 చిట్టచివరగా నిర్మించినది కదా అని జనమేజయ మహారాజు ఉదాశీనంగా ఏమీ ఊరుకోలేదు. 

అనేకమంది యోగులు, మంత్ర సిద్ధుల చేత శాస్త్రోకంగా పంచలింగాలను ప్రతిష్టించి సర్పదోషం నుండి విముక్తి పొందినట్టుగా గంగాపురాణం ప్రస్తావించింది.


💠 ఎందరో మహారాజుల పరిపాలన కాలంలో ఈ ఆలయంలో విశేష పూజాపురస్కారాలు జరిగాయి.

 ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖద్వారంగా విలసిల్లింది. 


💠 ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయులు దర్శించాడని ఆలయం ముందు ఉండే శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. 

ఈ శాసనాలలో విజయ నగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు నేటì కీ కనిపిస్తాయి. 


💠 రాయల సీమ కూడా ఈ ప్రాంతం నుండే ఆరంభం అయినట్టు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది.


💠 ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ప్రతిష్టించబడిన వీరభద్రుడు, సకల కోరికలు తీర్చేటువంటి చాముండి మాతను కూడా దర్శించుకోవచ్చు.

 ఇంకా ఈ ఆలయం చుట్టు అనేక శివాలయాలు వెలిశాయి. కానీ కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.


💠 గధాదరుడు అయినటు వంటి గయా నారాయణుడిని కూడా ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు.


💠 పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట. 

ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం, నవగ్రహ దోషం, మృత్యుదోషం, కుజ దోషం వంటి అనేక దోషాలు నివృత్తి అవుతాయని ఆలయ అర్చకుడు రంగాచార్యులు తెలిపారు.


💠 ఆలయానికి తూర్పు ముఖంగా తుంగానది ప్రవహిస్తుంది. 

ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ చేపట్టింది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat