సిక్కింలో చార్ థామ్ విశిష్టత

P Madhav Kumar

 


ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట కనిపిస్తే… పూరీ జగన్నాథుడితో పాటూ బద్రీనాథుడినీ ఒకేసారి దర్శించుకోగలిగితే… అంతకన్నా భాగ్యం ఏముంటుంది కదూ.. అంతేనా… ద్వారకాధీశుడితో పాటూ ఆకాశాన్నంటుతున్నట్లుగా కనిపించే పరమేశ్వరుడి విగ్రహాన్ని కూడా చూడాలంటే

చార్ ధామ్ గా పిలిచే సిద్ధేశ్వర్ థామ్ కు వెళ్తే సరి. సిక్కింలోని నామ్చీలో సోలోపోక్ కొండపైన కనిపించే ఈ ఆధ్యాత్మిక ధామాన్ని అక్కడి ప్రభుత్వం సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మించింది. విశాలమైన ప్రాంగణంలో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ సన్నిధానంలో 108 అడుగుల ఎత్తులో కనిపించే పరమశివుడి విగ్రహం, ఎదురుగా నంది కొలువుదీరిన వైనం ప్రధాన ఆకర్షణ అయితే… ఆ స్వామి చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఉండటం ఈ చార్ధామ్కి ఉన్న మరో ప్రత్యేకత. అలాగే, మెట్లకు ఇరువైపులా… రామేశ్వరం, బద్రీనాథ్, పూరీ జగన్నాథ్, ద్వారక ఆలయాల తాలూకు నమూనాలనూ దర్శించుకోవచ్చు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat