తెలుగు భాషకు యాబై ఆరు అక్షరాలు | Fifty six letters in Telugu language

P Madhav Kumar

 

తెలుగు భాషకు యాబై ఆరు అక్షరాలు | Fifty six letters in Telugu language
Fifty six letters in Telugu language

తెలుగు భాషకి యాబై ఆరు అక్షరాలు అనవసరమా?

   అనగనగా ఒకచోట తెలుగు బాషని ఆధునికం చెయ్యాలనే ఒక చర్చలో ఒక వ్యక్తి ఇంగ్లీషు 26 అక్షరాలతో యెంతో విస్తృతమయిన పదజాలాన్ని కలిగి వుండి ప్రపంచ వ్యాప్తం కాగా తెలుగు భాషకి 56 అక్షరాలు యెందుకు,తగ్గించుకుని ఫాస్టుగా యెదగొచ్చుగా అంటున్నారు. అక్షరాలు తక్కువగా వుండటం వల్లనే ఇంగ్లీషు భాష ప్రపంచవ్యాప్తం కాగలిగిందా?అక్షరాలు యెక్కువగా వుండటం వల్లనే తెలుగు వెనక బడిపోయిందా!

  పారిశ్రామిక విప్లవంతో వచ్చిన హుషారు వల్ల విపపరీతమయిన విధ్వంసాన్ని సృష్టించ గలిగిన కొత్తరకపు ఆయుధాలతో యుధ్ధాల ద్వారా దేశాల్ని ఆక్రమించుకుని ఆక్రమించిన ప్రతి చోటా బలవంతంగా నేర్పిస్తే జరిగిన వ్యాప్తిని అక్షరాలు తక్కువగా వుండటానికి అంటగడుతున్నారు, యేమి పిచ్చితనం?"ధర్మం" అనే మాటకి సరయిన పారిభాషిక పదాన్ని కనుక్కోలేక తల్లకిందులయి "Dutifulness" అనేది కొంచెం దగ్గిరగా వస్తుందని సరిపెట్టేసుకున్నారు. తెలుగులో ప్రతి అక్షరానికి ప్రాధాన్యత వుంది.భావాలకి మాత్రమే కాదు ద్వనులకి కూడా రూపం కల్పించారు. దానివల్ల మిగతా భాషల కన్నా పదజాలం లో విస్తృతి పెరగడం వల్ల అది గొప్పే అవుతుంది తప్ప లోపమెలా అవుతుంది? ఇతర భాషల్లో చెప్పలేని భావాన్ని కూడా చెప్పగలిగే గొప్పదనాన్ని కత్తిరించుకుని ఇతర భాషల మాదిరిగా తయారవడం అంటే  ఒక ఆజానుబాహుడు కొద్దిసేపు పొట్టివాళ్ళ మధ్య గడపటం కోసం కాళ్ళో తలో కత్తిరించున్నట్టు కాదా, అది అవసరమా?!
 
   పదవిస్తృతి యెంత అవసరమో ఒక వుదాహరణ చెప్తాను - ఈ మధ్యనే ఇంగ్లాండులో స్కూలు స్థాయిలో ఒక 2000 మంది విధ్యార్ధులకి వాళ్ళు వొపయోగించగలిగిన పదవిస్తృతి(vocabulary)నీ వాళ్ళ వ్యక్తిత్వ వికాసాల్లో వుండే తేడాల్నీ పరిశీలించి చూశారు.సహజంగానే యెక్కువ పదాల్ని వుపయోగించ గలిగిన వాళ్ళు అన్నిటిలోనూ అగ్రస్థానంలో వున్నారు!అలాంటిది ఇతర భాషలు వ్యక్తీకరించలేని భావాల్ని కూడా చెప్పటానికి పనికొచ్చే విస్తృతమయిన పదకోశం వుండి, ఇతర భాషల పదాల్ని అతి తేలిగ్గా ఇముడ్చుకోగలిగిన గొప్పదనాన్ని వొదులుకుని ఇంగ్లీషు లాగా వున్న అక్షరాలనే కత్తిరించుదాం అంటున్నారు,ఇది యేమి భాషాభిమానం?

   భాష ధాతుజన్యం, అంటే క్రియ ముఖ్యం.ప్రతి భాషలోనూ నామవాచక పదాలు,క్రియా పదాలు,విశేషణ పదాలూ - ఇలా విభాగాలు వుంటాయి. కానీ తమాషా యేంటంటే మిగతా రకం పదాల్లో కూడా క్రియ గుప్తంగా వుంటుంది. వుదాహరణకి రాముడు అనేది మనిషి పేరు.కానీ దాని అర్ధం రమింపజేయువాడు అని. అంటే రమింప జెయ్యటం అనే క్రియ అందులో దాగి వుంది. కారా మాస్టారు తెలుగు వాక్యం అనే ఒక పుస్తకం రాసారని చదివాను.వాక్య నిర్మాణానికి సంబంధించిన సూత్రాలే భాషలకి ప్రత్యెకత నిస్తాయి.ఇంగ్లీషులో ఆబ్జెక్ట్ చివరికి చేరుతుంది.తెలుగులో కర్త,కర్మ ,క్రియ అన్నీ ఆ వరసలోనే వుంటాయి.ముఖ్యంగా తెలుగు భాష ధ్వని ప్రధానమయినది(phonetic language), ఆ ప్రత్యేకతని పోగొట్టుకోవటం, అదీ ఇతర భాషల మాదిరిగా తయారు చెయ్యాలనే వుద్దేశంతో చెయ్యటం  మూర్ఖత్వం!

  తెలుగు భాష కున్న ప్రత్యేకత అందమైన పొందికైన అక్షరాల కూర్పు!ఇవి ఒక్కరోజులో వచ్చిపడ లేదు.దశల వారీగా అవసరం కొద్దీ పుట్టించినవే.మిగతా భాషలకి లేనిదీ తెలుగుకి మాత్రమే వున్న ప్రత్యెకత - ద్వనుల్ని కూడా అక్షరబధ్ధం చెయ్యటం.పైగా దశల వారీగా చేసిన మార్పులలో వరసగా పేర్చటంలో ఒక సౌలభ్యం వుంది.చూదండి:
  • అ & ఆ - కంఠ్యములు (గొంతుతో పలికేవి).
  • ఇ & ఈ తాలవ్యములు (కంఠానికీ, పళ్ళ చిగుళ్ళకీ మధ్య ఉన్న భాగాన్ని తాలువు అంటారు. తాలువుతో పలికేవి తాలవ్యములు).
  • ఎ, ఏ & ఐ - కంఠ్యతాలవ్యములు (కంఠము & తాలువుతో పలికేవి). 
  • ఋ & ౠ - మూర్ధన్యములు (నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచి పలికేవి).
  • ఌ, ౡ - దంత్యములు (నాలుక ముందు భాగాన్ని దంతాలకి తగిలించు పలికేవి).
  • ఉ & ఊ ఓష్ఠ్యములు (పెదవులతో పలికేవి).
  • ఒ, ఓ & ఔ - కంఠ్యోష్ఠ్యములు (కంఠము & పెదవులతో పలికేవి).
ఇప్పుడు స్పర్శములు (plosives) చూద్దాం. తెలుగులో "" నుంచి "" వరకు ఉన్నవి స్పర్శములు (నోటి భాగములతో గట్టి ప్రయత్నం చేసి పలికేవి). క, ఖ, గ, ఘ & ఙ - కంఠ్య స్పర్శములు (guttaral plosives).
  • చ, ఛ, జ, ఝ & ఞ - తాలవ్య స్పర్శములు (palatal plosives).
  • ట, ఠ, డ, ఢ & ణ - మూర్ధన్య స్పర్శములు (retroflex plosives).
  • త, థ, ద, ధ & న - దంత్య స్పర్శములు (dental plosives).
  • ప, ఫ, బ, భ & మ - ఓష్ఠ్య స్పర్శములు (labial plosives).
  • "ఙ, ఞ, ణ, న, మ"లు నాసిక్యములు (ఇవి పలికేటప్పుడు నోటిలో ఏదో ఒక భాగం గాలి ప్రవాహానికి అడ్డు తగిలి ముక్కు నుంచి గాలి బయటకి వస్తుంది).

స్పర్శములు కానివి అంతస్థములు (approximants). అవి:

  • య - తాలవ్య అంతస్థము.
  • ర, ఱ & ళ - మూర్ధన్య అంతస్థములు.
  •  - దంత్య అంతస్థము.
  •  - దంత్యఒష్ఠ్య అంతస్థములు (labiodental approximant).

గాలి ఊదుతూ పలికేవి ఊష్మములు (fricatives). అవి:

  •  - తాలవ్యోష్మము
  •  - మూర్ధన్యోష్మము
  •  - దంత్యష్మము
  • హ - కంఠ్యోష్మము
తెలుగుకి రాతలో వుండే సౌలభ్యం పెన్ను గానీ పెన్సిలు గానీ పేపరు మీద ఆనించి మొదలు పెడితే చివరి వరకూ ఒక్కపెట్టున రాయగలగడం."" లాంటివటికి కొన్ని మినహాయింపులు వున్నా తొందరగా రాసేటప్పుడు అవి కూడా చకచకా రాసెయ్యొచ్చు!

   పదాలు యెరువు తెచ్చుకోవడం తప్పు కాదు. పదుగు రాడుమాట పాడియై ధర జెల్లు నన్నట్లు మాట్లాడే వాడుక భాషే ముఖ్యం.భాషని పుట్టించే శక్తి కష్టజీవులకే వుంది! యెందుకంటే భాష పుట్టిందే పని కోసం కాబట్టి? ఒక పని చెయ్యాలంటే తను ఒక్కడే చెయ్యగలిగిన దయితే తనే వుపాయాలు ఆలోచించి చేసుకుంటాడు. కానీ ఇతర్ల సాయం అవసరం అయినప్పుడు తప్పనిసరిగా భాష కావాలి."నాకు నువ్వు ఈ సహాయం చెయ్యాలి" అని మరో మనిషిని అడగటానికే భాష పుట్టింది. పనిమంతులకి మాట్లాడటం ఒక అవసరం. ఆ అవసరం వున్నవాడు చిన్నయ సూరి కోసమూ చూడడు, రెన్ అంద్ మార్టిన్నూ వెదుక్కోడు.ఈ మధ్యనే ఫ్లై ఓవరుని ఒక పల్లెటూరి వాడు పైదారి అన్నాడని చదివాను.యేది బాగుంది?ఇంతకాలం ఆ చుట్టూ తిరుగుతూనే ఎవున్నా నాగరీకులూ పండితులూ అంత మంచిమాటని యెందుకు పుట్టించలేక పోయారు?

  అలా వాక్యనిర్మాణంలో తెలుగు యొక్క లక్షణాన్ని పాటిస్తున్నంతవరకూ యెన్ని రకాల పదాల్ని ఇముడ్చుకున్నా అది తెలుగే అవుతుంది. మాతృభాష అని యెందుకు అంటున్నాం అంటే మమకారం కోసం! పనిలో లీనమవ్వాలంటే పనిని ప్రేమించాలి. భాషని సరిగ్గా వాడుకోవాలంటే భాషని ప్రేమించాలి. ప్రతి భాషా మొదట అరుపులుగా కేకలుగా పుట్టిందే. ఆ అరుపుల్నీకేకల్నీ క్రమబధ్ధం చేస్తే అంటే వ్యాకరణాన్ని వుపయోగిస్తే భాష అయ్యింది.ఈ క్రమబధ్ధం చేసేవాళ్ళు యెక్కణ్ణించి వస్తారు? ఆ భాష మాట్లాడే వాళ్ళలోంచే వస్తారు గదా! పంచవేణీ సంగమం గురించి చెప్పుకుంటారు అన్ని రకాల పదాల్నీ కలుపుకోగలదని తెలంగాణాలో వినపడే తెలుగు గురించి.యేమండీ మీరొక్కరేనా కలుపుగోగలిగింది?కృష్ణా జిల్లా మాండలికంలో అంతా తెలుగు పదాలేనా?వుర్దూ పదాలూ ఇంగ్లీషు పదాలూ లేవా?

  అసలు భిన్నత్వంలో యేకత్వం అనేది మన దేశానికే పరిమితమనీ ఇంకెక్కడా ఇలా లేదనీ కొందరెందుకో అదేపనిగా పొగుడుతారు? అమెరికాలో ఇప్పుడు అనేక జాతుల వాళ్ళు కలిస్ బ్రతకటం లేదా? రష్యా అంతా యేక మొత్తమయిన భూఖండమా? సెర్బియన్లు, బోత్స్నియన్లు లేరా? ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళిన మనిషి అక్కడ యెక్కువ కాలం వుండాలంటే చచ్చినట్టు అక్కడి భాషని నేర్చుకోవలసిందే గదా! ఆ మనిషి తిరిగి తన ప్రాంతాని వస్తే అక్కద నేర్చుకున్న మాటల్ని ఇక్కడా మాట్లాడితే ఇక్కడివాళ్ళకి నచ్చితే అందరూ అలవాటు చేసుకుంటే ఆ పదాలు ఈ భాషలోకి వొదిగి పోవడం లేదా?

యేరుల జన్మం శూరుల జన్మం యేరికి తెలుసు? యే పదం యెప్పుడు పుట్టిందో యెప్పుడు చచ్చిందో యెప్పుడు మళ్ళీ పుట్టిందో తెలుసుకోవాలంటే పదవ్యుత్పత్తి శాస్త్రం వుంది.భాష యెదగాలంటే వాడే వాళ్ళు కూర్చేవాళ్ళు ఇద్దరూ వుండాలి,వాళ్ళ మధ్య సయోధ్య వుండాలి!ఇవ్వాళ తెలుగు కున్న దుస్థితి కూర్చే వాళ్ళు లేకపోవటం మరీ గట్టిగా చెప్పాలంటే కూర్చుకోవటం మీద శ్రధ్ధ లేకపోవటం?!యెవడిష్ట మొచ్చినట్టు వాడు మాట్లాడుకోవాలనే దురద పరిమితి దాటింది.పనిమంతుడెవడూ ఇలా పిల్లితల గొరిగే చర్చలకి రాడు!వాడి కవసరమయిన భాషని వాడే సృష్తించుకోగలడు!పండితులు అతడు సృష్టించిన పదాల్ని వుపయోగించుకుని కావ్యాలు రచించి పేరు తెచ్చుకుంటారు?!

   కూర్చడం యెవరు చెయ్యాలి?అధికారం వున్నవాడు చెయ్యాలి!అధికారం యెలా వస్తుంది?పదే పదే వాడటం వల్ల పరిచయం పెరిగి జ్ఞానం విస్తారమయితే అధికారం వస్తుంది!అస్లు అన్ని అక్షరాలు యెందుకు,భాష తల్లి కాదు ఒక కట్టుగొయ్య మాత్రమే అనేవాళ్ళతో యేమి మాట్లాడగలం,అనవసరం!అక్షరాలు తగ్గించితే పదవిస్తృతి తగ్గడమే తప్ప యే వుపయోగమూ వుండదు,అలాంటి వికృత ప్రయోగాల కన్నా అసలు తెలుగు మాట్లాడకుండా వుండటం మంచిది?!ఈ అక్షరాలు యెక్కువైనాయనే వాదం తెలంగాణా మేధావుల నుంచే వస్తున్నది.నిజమే, వారికి ఇన్ని అక్షరాలూ ఇంత విస్తృతమయిన పదజాలం అవసరం లేదు.ఇవి చాలు.ఆ బ్లాగరు యెప్పుడో సరదాగా వెక్కిరించిన దాన్ని ఇప్పుడు చాలా గంబీరమయిన తాత్విక చింతనతో యెత్తుకున్నారు:-) చారిత్రకంగా,బౌగోళికంగా ప్రాచీన కాలంలో ఇప్పుదు ప్రత్యెకరాష్ట్రంగా యేర్పడిన తెలంగాణా ప్రాంతంలోని తెలుగువాళ్ళనే ఆంధ్రులు అనీ వారిది ఆంధ్రత్వం అనీ వ్యవహరించే వాళ్ళు!వాళ్ళు నిన్నటి రోజున ఆ పేరుని మన రాష్ట్రానికి సాధికారికంగా ఇచ్చేసి ఆంధ్రత్వాన్ని వొదులుకున్నారు. ఇవ్వాళ తెలుగు భాషనీ చిన్నబుచ్చుతున్నారు, రేపు తెలుగుదనాన్నీ వొదులుకుంటారు? మహద్భాగ్యం, రేపటి రోజున అవి మనకు మాత్రమే సొంతమవుతాయి - కానివ్వండి!

  కొందరిలో మరొక విచిత్రం చూశాను - తెలుగు నా మాతృభాష అనటానికే శ్రీరాముడి ప్రస్తావన వొచ్చినప్పుడల్లా జవహరు లాల్ నెహ్రూ యెగిరి పడినట్టు వులిక్కి పడుతున్నారు? తెలుగును మాతృభాష అనుకోకపోతే యేం?తప్పనిసరిగా తెలుగుని అంతగా గౌరవించి తీరాలా? అనేవారికి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. విస్తారంగా చెప్పబోయే విషయాన్ని అర్ధం చేసుకోవాల్సిన పధ్ధతిలో అర్ధం చేసుకుంటే చాలు! ముందుగా ఒక సరదాగా వుండే పద్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను:-)

క్రమముగ "శ్రీమత్సకల గుణ సంపన్న"
యని యున్న జదివెడు నఱవవాడు

కడగి "చిరిమదు చగల కుణ చంపన్న"
యని,కన్నడము వాడు మొనసి

"సిరిమతు సగల గోణ" యని తోడనె
"శంపణ్ణ" యని,మహారాష్ట్రుండు పని వడివడి

జెలగుచు "శ్రీమతూ సెకల గుణానె
సంపన్నాసె" యని,యోడ్ర భాషణుండు

వెలయు "శ్రీమొతొ సొకొలో గుణ సొంపొన్నొ"
యని, యికెన్ని యేల యన్యభాష

లాంధ్రు డున్నయట్లె యలరు బఠించు
నంచు హాస్యవేది యాడునాడు:-))

  ఈ సరదా పద్యం రాసింది శ్రీ కొక్కొండ వెంకట రత్నం పంతులు గారు.ఈయనా వీరేశలింగం పంతులు గారూ అప్పట్లో గజకచ్చపాల్లాగా పోట్లాడుకునే వాళ్ళు - ప్రతిభ తోనే?!యీయన ఒక నాటకం రాసి అందులో పాలేరు పాత్రకి వీరిగాడు అని పెడితే ఆయనేమో ఒక నత్తిపాత్రతో తన పేరుని "కొక్కొక్కొండి గాడండి" అనీ చెప్పించాడు!

   సరదాగా రాసినా ఈ పద్యంలో ఒక సాంకేతికాంశం వుంది. ప్రపంచంలో వున్న ప్రతి భాషా ఒకే ప్రాంతంలో యెందుకు కేంద్రీకరించబడి వుంది?యెందుకంటే యే భాషకైనా అక్షరాలూ,పదాలూ, వాటి వుచ్చారణా ముఖ్యం - వాట్ని వేరు చేసేవి గూడా అవే!చలిగా వుందే ప్రాంతం వాళ్ళు కొన్ని ద్వనుల్ని చించుకున్నా పలకలేరు.వేడిగా వుందే ప్రాంతంలో వుండేవాళ్ళకీ అదే ఇబ్బంది?పై పద్యంలో జనరలైజ్ చెయ్యటమే తప్ప అన్నిచోట్లా పరాయి భాషల్ని కూడా చక్కగా మాట్లాడాలని పట్టుదలతో సాధించే వ్యక్తులు కొందరయినా వుంటారు!మొత్తమ్మీద ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితులకీ బౌగోళిక పరిస్థితులకీ అక్కడి ప్రజలు మాట్లాదే భాషకీ దగ్గిర సంబంధం వుండి వుండాలి?!ఆ రకంగా చూస్తే మన ప్రాంతం సరిగ్గా భూమధ్య రేఖ మీద వుండటంతో చలీ, వేడీ రెండూ సమానంగా తగుల్తుండటం చేతనే మనం అన్ని రకాల ద్వనుల్నీ పలక గలుగుతున్నామేమో!

   సుబ్బారావు వాళ్ళ అమ్మ మాట్లాడేది సుబ్బారావుకి మాతృభాషా మరియూ పుల్లారావు వాళ్ళమ్మ మాట్లాడేది పుల్లారావుకి మాతృభాషా అవదు! భాష ప్రాంతానికి సంబంధించినది కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ భాషే మాతృభాష అవుతుంది. స్తన్యమిచ్చి పెంచే కన్నతల్లితో యెంత గౌరవనీయమయిన స్త్రీ నైనా సమానం చెయ్యగలమా! యవ్వనంలో అమెరికా వంటి దూరదేశాలకు పోయి ఇక చాలు అనేటంత సంపాదించిన వాళ్ళు వృధ్ధాప్యంలో మళ్ళీ ఇక్కడే సెటిలవ్వాలని యెందుకు తపించి పోతున్నారు?మాతృదేశం పట్ల వుండే "జననీ జన్మభూమిశ్చ" అనే భావనతోనే గదా!మాతృదేశం అనే భావనని ఒప్పుకున్నపుడు మాతృభాష అనేదాన్ని ఒప్పుకోవటానికి అభ్యంతర మేమిటి?

  చాలామంది బెంగ పడుతున్నట్టు నేను తెలుగు యేమవుతుందో అని అతిగా బెంగ పడిపోవటం లేదు. మాట్లాడాల్సిన అవసరం వున్నవాడు తను చెప్పదల్చుకున్న దాన్ని యెదటివాళ్ళకి యెలా అయినా చెప్పి తీరతాడు, అందులో యెలాంటి అనుమానమూ అక్కర్లేదు.కానీ మాట్లాడాల్సిన అవసరం వున్నవాళ్ళకి తను చెప్పదల్చుకున్న భావానికి సరిపోయే మాట ఇక్కడ తెలుగులో వుంది అని తెలిస్తే గదా ఆ తెలుగు మాటనే వాడగల్గేది! ఆ తెలియజెప్పటం అనేది మాత్రం మనం పూనుకుని చెయ్యాలి.

ముందుగా ఇక్కడ నాకు పరిచయమయిన అచ్చతెలుగు మాటల్ని ఒక నాల్గింటి గురించి చెబుతాను:
  •  పైదారి  = Fly-over
  • పొద్దు మాను = Light house
  • తవ్వోడ = Dredger
  • చిచ్చు గోలి(లు) = Lighter
   వీటిల్లో వున్న అసలయిన విశేషం పలకడానికి తేలిగ్గా వుండటం కాదు అవి చేసే పనిని సూచించే పాండిత్యం ఆ పదాన్ని పుట్టించిన వాడికి వుండటం.తవ్వుకుంటూ వెళ్ళే ఓడ తవ్వోడ అయింది!ప్రతి వెలిగించే వస్తువుకీ వొత్తి వుంటుంది,అ వొత్తి చుట్టూ పుట్టే వెలుగు మొదట గోళాకారం లోనే వుంటుంది!

  ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఇదే: భాష పదాల సమాహారం, కనుక మొత్తం భాషకి సంబంధించిన విహంగ వీక్షణ కాదు మూలానికి వెళ్ళి ప్రతి పదాన్నీ దాని చరిత్రతో సహా పట్టించుకోవాలి!ఒక పదకోశం యేర్పాటు చెయ్యాలి?బ్రౌణ్య నిఘంటువు వుంది కదా అని అనవచ్చు. అది చాలా పరిమితం. కేవలం పదాన్నీ అర్ధాన్నీ చూపిస్తుంది,అంతే! నేను చెప్తున్నది etymological dictionary! వీలున్నంతవరకూ పైన చెప్పిన లాంటి అచ్చ తెలుగు పదాల్ని సేకరించాలి. అచ్చతెలుగు పదం కాకపోయినా అది యే భాషా పదమో చెప్పాలి. కైఫియత్ అనేది పరభాషా పదమే - కానీ కైఫియత్తు అనగానే తెలుగు పదమై పోయింది!

  ప్రామాణిక తెలుగు అనగానే రెండున్నర జిల్లాల భాష మామీద రుద్దాలని చూస్తున్నారు అని యెగిరిపడి దాన్ని పడనివ్వలేదు - మరి ఇప్పుడు మనం అఘోరిస్తున్న దేమిటి? అంత జేసీ కాళోజీ గారు నా గొడవ అనిండే గానీ నా లొల్ల్లి అనలే! రాష్త్ర గీతానికి మళ్ళీ ఆ నీటుభాషలోని పాటే యెక్కింది? ఇప్పుడు దీనికైనా కలిసి వస్తే మొత్తం 23 జిల్లాల లోనూ,లేని పక్షంలో ఇటువైపు 13 జిల్లాల లోనూ కలియదిరగాలి. వినపడే ప్రతి మాటనీ రికార్డు చెయ్యాలి. వీలున్నంతవరకూ అచ్చ తెలుగు పదాలనే సేకరించాలి.తప్పనిసరిగా అది తెలుగు పదం కాకపోయినా అందరూ వాడుతున్నారు గాబట్టి దానినీ ఆ ప్రస్తావనతో కలిపి యెక్కించాలి.మన మనసులోని భావాన్ని తెలిపేటందుకు తగ్గ పదం వుందనేది తెలిస్తే గదా వాడటం జరిగేది?పనిముట్టుగా చూసినా వాడకం వల్లనే గదా దాని పనితనం తెలిసేది!

   ఇదంతా ఒక్క రోజులో అయ్యేపని గాదనేది నాకు తెలుసు.తెలుగుని తెలుగులా వుంచడానికి యేడుస్తున్నవాళ్ళు పోయిన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుని అధికార భాషగా చేసుకోలేని వాళ్ళం నిజంగా చెయ్యగలుగుతామనీ కాదు, కానీ చెయ్యాల్సింది మాత్రం ఇదే!
ముఖే ముఖే సరస్వతి!

By : hari.S.babu

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat