*తారక బ్రహ్మము ధరణి నేలుటకై ఉద్భవించినది*
ఆ సమయమున దేవ దుందుభులు మ్రోగినవి. పుష్ప వర్షము కురిసినది. పిల్ల తెమ్మెరలు వీచినవి. ముల్లోకములు యందునూ శుభ శకునములు గోచరించినవి. దేవలోక వాసులు పరబ్రహ్మ
స్వరూపుడై గోచరించిన ఆ బాలకునికి ప్రణమిల్లిరి. త్రిమూర్తులు , దేవతలు , ఋషులు అందరూ
బాలకుని వేనోళ్ళ పొగడిరి. త్రిశక్తులు ఆ బాలకుని ఊయలలో వేసి ఆడించిరి. అందరూ ఆ స్వామి యొక్క అద్భుతరూప లావణ్యములను చూచి కనురెప్ప వేయుట కూడా మరచినవారైరి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
