శనివారవ్రత మహిమ*
ఒకప్పుడు విదర్భ దేశమును *'మహీధరుడు'* అను రాజు పరిపాలించుచుండెను. అతడు స్వామియొక్క పరమభక్తుడు విధివశాత్తు *'రౌద్రశ్వుడు'* అను రాజుచే ఓడింపబడి , రాజ్యమును కోల్పోయి. అడవులందు అజ్ఞాతవాసము చేయు పరిస్థితి ఏర్పడినది.
కాననము నందున్ననూ , స్వామిని పూజించుట మానలేదు. అతడికి సహాయము చేయగోరి ,
అగస్త్య మహాముని అతడివద్దకు పోయి , స్వామి భక్తుడైన రాజునకు , శనివారవ్రతమును
ఆచరింపుమనియూ , వ్రతవిధానమునూ నుడివెను.
ముని యొక్క మాట ప్రకారము మహీధరుడు ఆరు నెలలపాటు భక్తి శ్రద్ధలతో వ్రతమును
ఆచరించగా , మెచ్చిన స్వామి అతడిముందు సాక్షాత్కరించెను. తన గణములచే మహారాజునకు సాయముగా పంపి , యుద్ధమున మహీధరుడు తన శత్రువులను అవలీలగా చంపునట్లు చేసెను. స్వామి అనుగ్రహమును సదా పొందుచూ , మనోరంజకముగా పరిపాలించసాగెను.
శాస్తా కొరకై చేయు వ్రతములన్నిటిలోనూ , మిక్కిలి శ్రేష్ఠమైన ఈ వ్రతమును గూర్చి చెప్పనలవికాదు. ఈ వ్రత ఫలితముగానే ఇంద్రుడు జయంతుని పుత్రునిగా పొందెను. వ్యాసుడు శుకమహర్షిని తనయునిగా పొందెను. అత్రిమహర్షి రుద్రాంశ సంభూతుడైన దుర్వాసుని కుమారునిగా పొందెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
