కవలలను హతమార్చిన శాస్తా
వింధ్య పర్వతమునకు దక్షిణ దిక్కున అమరియున్న విశ్వమంగళము అను రాజ్యమును
భీమనాధుడను రాజు పరిపాలించుచుండెను. ఇతడి భార్య పేరు సుదేహి. వీరిరువురూ అఖిలలోక పాలకుడైన శ్రీమహాశాస్తా పట్ల భక్తి కలవారై యుండిరి.
వేటయందు అమిత మక్కువగల భీమనాధుడు , ఒకనాడు వేట నిమిత్తమై తన రాజ్యపు పొలిమేరల యందున్న అడవికి వెళ్ళెను , వేటకై వెళ్ళిన మహారాజు ఎట్లో తన పరివారమును వదలి ,
దారి తెలియక వేరు చోటికి పోయెను. వేట యందు కలిగిన దప్పిక తీరు మార్గము దొరకక ,
అలసిపోయి సొమ్మసిల్లెను.
అటువైపుగా వచ్చిన అసురకన్యయైన రత్నప్రభ యనునది సొమ్మసొల్లి పడియున్న మహారాజుని
చూచి , అతడి అందచందములకు బానిస అయినది. అతడి వాలకము చూచి మహారాజుగా గుర్తించి ,
తనలో తాను ఇట్లు అనుకొనెను. *'అసురకన్య అయిన నన్ను ఈ మానవుడు మనువాడజాలడు. మాయోపాయము పన్ని , జరిగినదంతయూ మరచిపోవునట్లు చేసి , ఆ పై అతడిని పొందుదును”*
అనుకొనెను.
అప్పటికప్పుడు సకల సౌకర్యములు కలిగిన భవనమును నిర్మింపజేసి మహారాజును అచట
ఉంచెను. కళ్ళు తెరచి చూచిన మహారాజు , రాక్షస మాయవలన జరిగిన దంతయూ మరచినవాడై , తన ఎదుట నిలచిన యౌవనవతిని చూచి మొహించి పరిణయమాడెను.
ఇంతలోగా , మహారాజు జాడ తెలియక , భార్య అయిన సుదేహి ఎంతగానో వగచుచూ ,
బాధలను తీర్చు దైవమైన శ్రీ మహాశాస్తాతో తన గోడు విన్నవించుకొనెను. భక్తుల అభీష్టము నెరవేర్చు మహాశాస్తా ఆకాశవాణి రూపుగా *“భక్తురాలా ! నీ భర్త ఒక రాక్షసి మాయలో పడి జరిగిన దంతయూ మరచిన వాడయ్యెను. నా ఆలయమున 48 రోజుల పాటు విశేష అభిషేక , ఆరాధనలు చేసి , అన్నదానము చేసినచో నీ భర్త రక్కసి పిడికిలి నుండి తప్పించుకుని, నిన్ను చేరుకొనును”* అని
పలికెను. స్వామి చెప్పిన విధముగానే సుధేహి ఆలయమునందే ఉండి 48 రోజులు విశేష అభిషేక
ఆరాధనలు చేసి , అన్నదానము గావించినది. ఫలితముగా రాక్షస మాయలో మునిగి యున్న
మహారాజునకు వాస్తవము గోచరించినది. *“ఈ రాక్షస మాయలో పడి ఇన్ని దినములూ నన్ను నేను మరచినవాడనైతిని. నిజము తెలిసినచో ఆ రాక్షసి నన్ను వదలదు కదా. ఎట్లైనను తప్పించుకొనవలెను"*
అని ధృడముగా నిశ్చయించుకొని , స్వామిని చిత్తమున నిలుపుకుని , ధ్యానించుచూ ఆ అడవిని దాటి , తప్పించుకుని తన రాజ్యమునకు వచ్చి చేరెను. మహారాణియైన సుధేహి మిక్కిలి సంతసించి , తనకు
మరల జీవితమును ప్రసాదించిన శాస్తాను స్తుతించి , అతడి ఆశీర్వాదమును పొందెను.
రాక్షస కన్య అయిన రత్నప్రభ. , మహారాజు తన వద్ద నుండి తప్పించుకున్న సంగతి
తెల్సుకున్నదై మిక్కిలి దుఃఖించినది. ఆ సమయమున ఆమె గర్భవతియై యుండుటచే , సమయమునకై వేచి యెండెను. కొంత కాలమునకు ఆమెకు హంసకేతు , విజయకేతు అను కవలల కలిగిరి. వారిని వీరులుగా , ధీరులుగా తీర్చిదిద్దెను.
సుధేహియూ ఒక మగబిడ్డను ప్రసవించెను. తల్లిదండ్రులు ఆ బాలునకు *'సుశాంతుడు'* అను
నామమునిడిరి. యుక్తవయస్సు రాగానే మద్రదేశపు రాకుమార్తె అయిన *'కాంతిమతి'* యను కన్యతో
వివామము గావించిరి. భీమనాధుని అనంతరము, సుశాంతుడు రాజ్యభారము బూని , పట్టాభిషిక్తుడై
మహాశాస్తాని సేవించుకుంటూ , సుఖశాంతులతో రాజ్యపాలన చేయసాగెను.
ఇదే సమయమున రత్నప్రభ సోదరుడైన *'మధుక్రీటుడు'* అనువాడు సుశాంతుని రాజ్యమున నున్న ప్రజలను బాధింపసాగెను. ప్రజలు మహారాజుని ప్రార్థించగా , తన సేనలతో వెడలి మధుక్రీటునితో యుద్ధము చేసి వాడిని అంతముగావించెను. ఈ సంగతి విన్న హంసకేతు ,
విజయకేతువులు కోపము బూనిరి. తల్లియైన రత్నప్రభ వారితో *“బిడ్డలారా ! మహారాజు సుశాంతుడు పేరు ఎవరో కాదు. మీకు తోబుట్టువే. మీ మేనమామ చేసిన ఘోరకృత్యములకుగాను , కర్తవ్యరక్షణకై చంపవలసి వచ్చినది. కాబట్టి మీరు అతడిపై కినుకబూనవలదు”* అని వారించి , సమాధాన పరచినది.
తల్లి చెప్పిన సంగతి విన్న సోదరులు ఆశ్చర్యము చెంది , *“అయినచో తండ్రిగారి మొదటి సంతానము మేమే గావున , రాజ్యపాలన చేయు హక్కు కూడా మాకే కలదు. సుశాంతునితో యుద్ధము చేసి అతడిని చెరపట్టి , రాజ్యమును చేబట్టుదుము”* అని ప్రతిన బూనిరి. తల్లి ఎంత
వారించిననూ పెడచెవిని పెట్టి , సేనను సమకూర్చుకుని , విశ్వమంగళ దేశముపై దండెత్తి వెళ్ళిరి.
సుశాంతుడు ధర్మనిరతుడై ఓపికగా , వారిని సహించుచూ , మరొక పక్క పరాక్రమవంతుడై
వారితో యుద్ధము చేయసాగెను. రాక్షస సేన ముందు అతడి బలపరాక్రమములు నిలువజాలక , ఓడిపోయెను. సుశాంతుడు అతడి భార్య చెరసాలయందు బంధింపబడియుండిరి. విజయులైన
అసురపుత్రులు సింహాసనమున అమరి , దుష్టపరిపాలన చేయసాగిరి.
భీమనాధుడను రాజు పరిపాలించుచుండెను. ఇతడి భార్య పేరు సుదేహి. వీరిరువురూ అఖిలలోక పాలకుడైన శ్రీమహాశాస్తా పట్ల భక్తి కలవారై యుండిరి.
వేటయందు అమిత మక్కువగల భీమనాధుడు , ఒకనాడు వేట నిమిత్తమై తన రాజ్యపు పొలిమేరల యందున్న అడవికి వెళ్ళెను , వేటకై వెళ్ళిన మహారాజు ఎట్లో తన పరివారమును వదలి ,
దారి తెలియక వేరు చోటికి పోయెను. వేట యందు కలిగిన దప్పిక తీరు మార్గము దొరకక ,
అలసిపోయి సొమ్మసిల్లెను.
అటువైపుగా వచ్చిన అసురకన్యయైన రత్నప్రభ యనునది సొమ్మసొల్లి పడియున్న మహారాజుని
చూచి , అతడి అందచందములకు బానిస అయినది. అతడి వాలకము చూచి మహారాజుగా గుర్తించి ,
తనలో తాను ఇట్లు అనుకొనెను. *'అసురకన్య అయిన నన్ను ఈ మానవుడు మనువాడజాలడు. మాయోపాయము పన్ని , జరిగినదంతయూ మరచిపోవునట్లు చేసి , ఆ పై అతడిని పొందుదును”*
అనుకొనెను.
అప్పటికప్పుడు సకల సౌకర్యములు కలిగిన భవనమును నిర్మింపజేసి మహారాజును అచట
ఉంచెను. కళ్ళు తెరచి చూచిన మహారాజు , రాక్షస మాయవలన జరిగిన దంతయూ మరచినవాడై , తన ఎదుట నిలచిన యౌవనవతిని చూచి మొహించి పరిణయమాడెను.
ఇంతలోగా , మహారాజు జాడ తెలియక , భార్య అయిన సుదేహి ఎంతగానో వగచుచూ ,
బాధలను తీర్చు దైవమైన శ్రీ మహాశాస్తాతో తన గోడు విన్నవించుకొనెను. భక్తుల అభీష్టము నెరవేర్చు మహాశాస్తా ఆకాశవాణి రూపుగా *“భక్తురాలా ! నీ భర్త ఒక రాక్షసి మాయలో పడి జరిగిన దంతయూ మరచిన వాడయ్యెను. నా ఆలయమున 48 రోజుల పాటు విశేష అభిషేక , ఆరాధనలు చేసి , అన్నదానము చేసినచో నీ భర్త రక్కసి పిడికిలి నుండి తప్పించుకుని, నిన్ను చేరుకొనును”* అని
పలికెను. స్వామి చెప్పిన విధముగానే సుధేహి ఆలయమునందే ఉండి 48 రోజులు విశేష అభిషేక
ఆరాధనలు చేసి , అన్నదానము గావించినది. ఫలితముగా రాక్షస మాయలో మునిగి యున్న
మహారాజునకు వాస్తవము గోచరించినది. *“ఈ రాక్షస మాయలో పడి ఇన్ని దినములూ నన్ను నేను మరచినవాడనైతిని. నిజము తెలిసినచో ఆ రాక్షసి నన్ను వదలదు కదా. ఎట్లైనను తప్పించుకొనవలెను"*
అని ధృడముగా నిశ్చయించుకొని , స్వామిని చిత్తమున నిలుపుకుని , ధ్యానించుచూ ఆ అడవిని దాటి , తప్పించుకుని తన రాజ్యమునకు వచ్చి చేరెను. మహారాణియైన సుధేహి మిక్కిలి సంతసించి , తనకు
మరల జీవితమును ప్రసాదించిన శాస్తాను స్తుతించి , అతడి ఆశీర్వాదమును పొందెను.
రాక్షస కన్య అయిన రత్నప్రభ. , మహారాజు తన వద్ద నుండి తప్పించుకున్న సంగతి
తెల్సుకున్నదై మిక్కిలి దుఃఖించినది. ఆ సమయమున ఆమె గర్భవతియై యుండుటచే , సమయమునకై వేచి యెండెను. కొంత కాలమునకు ఆమెకు హంసకేతు , విజయకేతు అను కవలల కలిగిరి. వారిని వీరులుగా , ధీరులుగా తీర్చిదిద్దెను.
సుధేహియూ ఒక మగబిడ్డను ప్రసవించెను. తల్లిదండ్రులు ఆ బాలునకు *'సుశాంతుడు'* అను
నామమునిడిరి. యుక్తవయస్సు రాగానే మద్రదేశపు రాకుమార్తె అయిన *'కాంతిమతి'* యను కన్యతో
వివామము గావించిరి. భీమనాధుని అనంతరము, సుశాంతుడు రాజ్యభారము బూని , పట్టాభిషిక్తుడై
మహాశాస్తాని సేవించుకుంటూ , సుఖశాంతులతో రాజ్యపాలన చేయసాగెను.
ఇదే సమయమున రత్నప్రభ సోదరుడైన *'మధుక్రీటుడు'* అనువాడు సుశాంతుని రాజ్యమున నున్న ప్రజలను బాధింపసాగెను. ప్రజలు మహారాజుని ప్రార్థించగా , తన సేనలతో వెడలి మధుక్రీటునితో యుద్ధము చేసి వాడిని అంతముగావించెను. ఈ సంగతి విన్న హంసకేతు ,
విజయకేతువులు కోపము బూనిరి. తల్లియైన రత్నప్రభ వారితో *“బిడ్డలారా ! మహారాజు సుశాంతుడు పేరు ఎవరో కాదు. మీకు తోబుట్టువే. మీ మేనమామ చేసిన ఘోరకృత్యములకుగాను , కర్తవ్యరక్షణకై చంపవలసి వచ్చినది. కాబట్టి మీరు అతడిపై కినుకబూనవలదు”* అని వారించి , సమాధాన పరచినది.
తల్లి చెప్పిన సంగతి విన్న సోదరులు ఆశ్చర్యము చెంది , *“అయినచో తండ్రిగారి మొదటి సంతానము మేమే గావున , రాజ్యపాలన చేయు హక్కు కూడా మాకే కలదు. సుశాంతునితో యుద్ధము చేసి అతడిని చెరపట్టి , రాజ్యమును చేబట్టుదుము”* అని ప్రతిన బూనిరి. తల్లి ఎంత
వారించిననూ పెడచెవిని పెట్టి , సేనను సమకూర్చుకుని , విశ్వమంగళ దేశముపై దండెత్తి వెళ్ళిరి.
సుశాంతుడు ధర్మనిరతుడై ఓపికగా , వారిని సహించుచూ , మరొక పక్క పరాక్రమవంతుడై
వారితో యుద్ధము చేయసాగెను. రాక్షస సేన ముందు అతడి బలపరాక్రమములు నిలువజాలక , ఓడిపోయెను. సుశాంతుడు అతడి భార్య చెరసాలయందు బంధింపబడియుండిరి. విజయులైన
అసురపుత్రులు సింహాసనమున అమరి , దుష్టపరిపాలన చేయసాగిరి.
