41. కాకమైథున దర్శనాది శాంతి ప్రయోగః | Kākamaithuna darśanādi śānti prayōgaḥ | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

41. కాకమైథున దర్శనాది శాంతి ప్రయోగః | Kākamaithuna darśanādi śānti prayōgaḥ | Veerashaiva Purohitam

కాకమైథున దర్శనాది శాంతి ప్రయోగః

మంత్రము :- 
“కాకోమై ధునయుక్తశ్చేచ్ఛ్వేతః సయదిదృశ్యతే సనరో మృత్యుమాప్నోతిహ్యధవా స్థాననాశనమ్॥౧॥ కాకస్యమైధునంపశ్యేత్కాకః శిరసిచేద్విశేత్ । శిరస్సురసి వాకుర్యాత్పుక్షాఘాతం నఖైస్తథా ॥౨॥ విదారణంచ కురుతే శయనంచప్పృశేద్యది । తదావదేత్తు మరణం మహారిష్ట మధోపివా॥౩॥ తద్దోషశమనాయేత్తం శాంతికర్మ సమాచరేత్”

కాకమైధునమును జూచినను, కాకితలపై కూర్చుండినను, తలనుగాని, అధవా ఏదముగాని, రెక్కలు లేదా గోళ్ళతోగాని తాకించినను, నొప్పించినను, పడకను ముట్టినను, మహా అరిష్టము మరియు మరణము సంభవించును. ప్రయుక్త విద్యుక్తముగా శాంతినాచరింపవలయును, ఎట్లనగా దేశకాలాదులను జెప్పి

మంత్రము :- 
“మమకాకిమైధునాది సూచిత సర్వానిష్ట ప్రశాంతి పూర్వక మాయురారోగ్య సుఖశ్రీ ప్రాప్త్యర్థం కాకమైధునదర్శనశాంతిం కరిష్యే”

అని సంకల్పించి గణపతిపూజా, పుణ్యాహవాచన ఆచార్యవరణాదుల నాచరించి గృహముయొక్క ఈశాన్య భాగమున స్థండిలమును జేసి, అందు పంచ భూసంస్కార పూర్వకముగా వరదనామక అగ్నిని స్థాపించి, దానికి ఈశాన్య దిశలో కలశమును స్థాపించి, కలశముపై పాత్ర నొకదానినుంచి, అందులో బంగారముతో జేయబడిన ఇంద్రుని ప్రతిమను మరియు రుద్ర ప్రతిమలను అగ్న్యుత్తరణపూర్వకముగా ఉద్ది యొనర్చిఉంచి

మంత్రము :- 
“ఓం త్రాతర మింద్రమవితార మింద్రగమ్ హవే హవే సువహగమ్ శూరమింద్రమహ్వయామిశక్రం పురహూత మింద్రగమ్ స్వస్తినోమఘవాకరోతుః ఓం భూర్భువఃస్వః ఇంద్రాయిహాగచ్ఛాగచ్ఛ ఇహతిష్ఠ ॥ అనియు

“ఓం త్ర్యంబకం యజామహే...మామృతాత్” “ఓం భూర్భువఃస్వః త్ర్యంబకం ఇహాగచ్ఛాగచ్ఛ ఇహతిష్ఠ” అని యుచ్చరించి, ఇంద్రుని మరియు త్ర్యంబకుల నావాహించి “ఓం ఇంద్రాయ నమః” అని నామ మంత్రముచేత ఇంద్రుని, “ఓం త్ర్యంబకాయ నమః” అను నామ మంత్రముచేత రుద్రుని షోడశోపచారములతో బూజించునది. పిదప పూర్వోక్త ప్రకారముగా నిర్మించిన హోమకుండములో “ఓం త్రాతర మింద్రం...మేఘవధాత్మింద్రః” అను మంత్రముతో “ఓం త్ర్యంబకం...మామృతాత్” అను మంత్రముతో పలాశ సమిధను, నెయ్యిని, వ్రీహి (వరి ధాన్యమును) వీటితో ప్రత్యేకించి (౧౦౮) నూటా యెనిమిది సార్లు ఆహుతులనొసగి మరియు బలిదానమును గూడ ఒసగి,

మంత్రము :- 
“ఓం ఇంద్రవారుణ వాయవ్యాః సౌమ్యావై నైఋతస్తథా। వాయసః ప్రతి గృహ్లంటు భామానన్నం మయార్పితం” అనే మంత్రము నుచ్చరించి, పాయసము బలియొసగి, పిదప పూర్ణాహుతి ఇచ్చి కలశోదకముతో యజమానుని అభిషేకించి, నెయ్యి నింపిన పాత్రలో ముఖమును జూచి, ఆచార్యునకు పాలిచ్చే సవత్స (లేగతోనున్న) గోవును, రెండు ప్రతిమలను సంకల్ప పూర్వకముగా నొసగవలెను. ఎదురు 25 అథవా 27 మంది మాహేశ్వరులకు భోజనము జేయించి దక్షిణ తాంబూలాదులతో తృప్తి పరచవలెను. మాహేశ్వరులు స్వస్తి వాచన పూర్వకముగా నాశీర్వదించవలెను.

“ఏవం కృతే భవేచ్ఛాంతిః కాకారిష్ట వినాశినీ”

( ఇతి కాకమైధున దర్శనాది శాంతిః )

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow