లక్ష్మి చేన్నకేశవా స్వామి దేవాలయం -గంగాపురం,జడ్చెర్ల..!!

P Madhav Kumar

 లక్ష్మి చేన్నకేశవా స్వామి దేవాలయం -గంగాపురం,జడ్చెర్ల..!!


మహాబూబనగర్ జిల్లాలోని జెడ్చెర్ల కి 6 కి మీ దూరం లో వెలసిన మహిమన్మితమైన దివ్య క్షేత్రం లక్ష్మి చెన్న కేశవా స్వామి దేవాలయం.


మన రాష్ట్రము లో ఉన్న లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయాల్లో ఎంతో ప్రసిద్దిగాంచిన దేవాలయం ఇది. 


ఈ క్షేత్ర మహత్యాన్ని స్కాందపురాణం లోని తీర్థకండం లో పేర్కొనడం జరిగింది .


 ఈ ప్రాంతానికి మత్స్యపురి, దురితకోలహలం, మాయాపురి, గంగాపురం అని నాలుగు యుగాల్లో నాలుగు పేర్లు ఉన్నాయి అని చెబుతారు .


 పూర్వం ఈ ప్రాంతాన్ని పారిపలించిన దేవసేనుడు అనే రాజు ఈ ప్రాంతం లో నిల్లు లేకపోవడం తో హిమాలయాలకు వెళ్లి గంగమ్మ కోసం తపస్సు చేయగా ఆ తల్లి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోనమనగా 


నా వెంట వచ్చి మా పట్టణము నందు ప్రవహించమని కోరగా అమ్మ వారు అంగికరించి ఈ ప్రాంతం లో ప్రవహించినది అని అందుకే దానికి దేవసేన నది అని పేరు వచ్చినది అని స్థల పురాణం .


 ఆ నదిమ తల్లి పేరిట ఈ ప్రాంతానికి గంగాపురం వచ్చింది అని చెబుతారు . 

 

చాళుక్యులు కాలం లో నిర్మించన ఈ దేవాలయం ఎంతో అద్బుతంగా ఉంటుంది . 


అద్బుతమైన శిల్పకళ ,కట్టడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి . ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజ కార్యక్రమాలు విశేషంగా ఉంటాయి .


 ప్రతి శనివారం ప్రత్యేక పూజలు ,రాత్రి పుట గ్రామోత్సవం (ఊరేగింపు సేవ ) జరుగుతాయి . 


ఆలయ ద్వారాలు ,ఆలయ ఆవరణ లో ఉన్న మండపాలు చాల చూడచక్కగా ఉంటాయి . 


ఆలయ ఆవరణ లో ఆంజనేయ స్వామి దేవాలయం కలదు . సుమారు 60 సంవత్సరాల క్రితం ప్రతిష్టించినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది . 


ప్రత్యేక కార్యక్రమాలు :- 

గంగ తిరునాళ్ళు (గంప జాతర) ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసం లో చివరి శనివారం జరుగుతుంది.




Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat