కృష్ణుడికి రుక్మిణికి జన్మించన సంతానం - ప్రద్యుమ్నుడు.....!!

P Madhav Kumar


 ప్రద్యుమ్నుడు.....!!


🌸ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడికి రుక్మిణికి జన్మించన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతంలో వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు.


🌷శంభరాసురుడు ప్రద్యుమ్నుడిని అపహరించడం🌷


🌿శంభరాసురుడు అనే రాక్షసుడు తనకు భవిష్యత్తులో ప్రద్యుమ్నుడు యముడవుతాడని గ్రహించి శంభరాసురుడు ప్రద్యుమ్నుడిని రుక్మిణి దేవి పురుటి మంచం నుండి అపహరించి సముద్రంలో పారేస్తాడు.


🌸ఆ విధంగా పురిటి మంచం నుండి సముద్రం పడిన ప్రద్యుమ్నుడిని ఒక చేప మ్రింగుతుంది. జాలర్లు ఆ వల వేసి చేపలు పట్టుతుండగా ఈ చేప వారికి దొరుకుతుంది.


🌿చేప చాలా పెద్దగా ఉండడం చూసి తమ రాజు శంభరాసురుడికి బహుమతిగా ఇస్తారు. శంభరాసురుడు ఆ చేపని వంటశాలకు పంపిస్తాడు.


🌸వంటశాలలో ఆ చేపని కోయగా ఆ చేపనుండి ప్రద్యుమ్నుడు బయట పడాతాడు. అప్పుడు వంటవారు ఆ శిశువు తీసుకొని రాజుకి ఇవ్వగా శంభరాసురుడి కొలువులో ఉన్న మాయావతి ఆ శిశువుని పెంచుకోవాలి అని చెబుతుంది.శంభరాసురుడు దానికి అంగీకరిస్తాడు.


🌷ప్రద్యుమ్నుడి జన్మ వృత్తాంతం🌷


🌿ప్రద్యుమ్నుడు పూర్వపు జన్మలో మన్మథుడు. శివుడి కోపాగ్నికి గురై భస్మమైన మన్మధుడు నారాయణుడి కృపతో తన కుమారుడిగా జన్మిస్తాడు.


🌸రతి దేవి మన్మధుడు భస్మమై నప్పుటి నుండి మాయావతి అనే పేరుతో ఇక్కడ అక్కడ తిరుగుతూ శంభరాసురుడి వద్దకు చేరు కొంటుంది.


🌿మాయావతి (రతి దేవి) ప్రద్యుమ్నుడిని పెంచుకొంటుండగా ఒకరోజు నారదుడు వచ్చి జన్మవృత్తాంతం చెబుతాడు. ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాక మాయావతి తనని వివాహం చేసుకొవలసిందిగా కోరుతుంది.


🌸దానికి ప్రద్యుమ్నుడు చింతించి నీకు కామ వాంఛ కలగడం అనుచితం అంటాడు. అప్పుడు మాయావతి వారిద్దరి జన్మ వృత్తాంతం తెలిపి శంభరాసురిడిని చంపవలెంటే మాయా విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి మాయాశక్తి విద్యని నేర్పుతుంది.


🌿ప్రద్యుమ్నుడు శంభరాసురుడిని సంహరించడం సవరించు

ప్రద్యుమ్నుడు పెద్దవాడయ్యాక శంభరాసురుడిని దూషిస్తూ మాట్లాడుతుండగా శంభరాసురుడు ప్రద్యుమ్నుడీ మీద యుద్ధం ప్రకటిస్తాడు.


🌸సంభరాసురుడు ప్రద్యుమ్నుడి మీద గద విసురగా ప్రద్యుమ్నుడు తన గదా దండం విసిరి దారి మధ్యలోనే ఆ శంభరాసురిడి గదని విరగోట్టుతాడు.


🌿తరువాత శంభరాసురుడు తన మాయావిద్య వినియోగించి ఆకాశం లోకి మాయం అయ్యి శర వర్షం కురిపిస్తండగా ప్రద్యుమ్నుడు మాయాశక్తి వినియోగించి శంభరాసురిడి మాయ పటాపంచెలు చేసి శంభరాసురిడి తలని ఛేధిస్తాడు.


🌸ఆ విధంగా శంభరాసురిడి మరణించడం చూసిన దేవ గంధర్వ కిన్నెర కింపురుషులు ప్రద్యుమ్నుడి మీద పూల వర్షం కురిపిస్తారు.


🌷ప్రద్యుమ్నుడు ద్వారకకు తిరిగి రావడం🌷


🌿మాయవతి (రతి దేవి) తన మాయాశాక్తి వినియోగించి ఆకాశ మార్గములో ప్రద్యుమ్నుడితో పాటు ద్వారక నగరం చేరుకొంటుంది.


🌸ద్వారక నగరమునకు చేరుకొన్న ప్రద్యుమ్నుడిని చూసిన ప్రజలు కృష్ణుడు వలే ఉన్నాడు కాని వీనిలో కృష్ణుడి లక్షణాలు అన్ని లేవు అని భావిస్తుండగా...


🌿రుక్మిణి దేవి అక్కడకు వచ్చీ తన పురిటినాటి విషయాలి జ్ఞప్తికి తెచ్చుకొని ఈ పిల్లవాడు నా కుమారుడు వలే ఉన్నాడని అనుకొంటుంది.


🌸అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడ వచ్చి జరిగిన విషయాలు అన్ని తెలుసుకొని ప్రద్యుమ్నుడికి మాయావతి విద్యుక్తంగా వివాహం జరిపిస్తారు...

అంతా తెలిసిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదిస్తాడు......🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat