పోలాల అమావాస్య

P Madhav Kumar


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

శ్రావణ బహుళ అమావాస్యను _*'పోలాల అమావాస్య'*_ అంటారు♪. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది♪.

స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం♪. ఈ  _*‘పోలాల అమావాస్య వ్రతం’*_  ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది♪.  పెళ్లయి చాలాకాలమైనా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి♪.
ఈ వ్రతాన్ని శ్రావణమాసం అమావాస్య నాడు చేసుకోవాలి♪. పూజచేసే చోట గోమయంతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆ తర్వాత ఆ కందమొక్క లోకి మంగళగౌరీదేవిని గానీ, సంతాన లక్ష్మీదేవిని గానీ ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లు, గారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి♪. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి♪. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి♪. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు♪.
ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు గారెలు,మగపిల్లవాడు కావాలను కునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు♪.

ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే.., పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం♪. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం♪. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు♪.

ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము♪.

ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు♪. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు♪.

వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు♪. అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు♪. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది♪.

గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు♪. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు♪. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ... ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు♪.

జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి♪. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి♪. వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి♪. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది♪. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ఆర్ధికంగాను ఆదుకుంటాయి♪.

తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను ... పెద్దలను ... పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది♪. గ్రామదేవతను ఆరాధిస్తూ ... వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది♪. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది♪.

*ఈ వ్రతంలో ముఖ్యమైన కధ ప్రాచుర్యంలో వుంది అది..*.

"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు♪. అందులో, ఏడో కోడలికి ఏటా ఒక పిల్లాడు పుడతాడు♪. కానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడు♪. అలాగ ఆరు సంవత్సరాలు జరుగుతుంది♪. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దెప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు ఆ పండుగ జరుపుకోలేకపోతున్నారు అని♪. ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కొన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి ఉంచేస్తుంది♪. అందరూ పూజ చేసుకుంటారు♪. అది అయ్యాక, ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది♪. అదిచూసిన పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి "ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగు తారు♪. దానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుంది. దానికి వారు - "మేమే ఆర్చేవారము - తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు♪. ఆమె తన గోడు చెప్పుకుంటుంది♪. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు♪. అప్పుడు ఆమె భుజం మీద ఉన్న బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు♪. వారిని చూసిన ఆశ్చర్యంలో ఆదంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు♪.

అప్పుడు - అది పార్వతీ పరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుంది♪.
అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు♪. అప్పటినుండి ఆమె ప్రతి ఏటా తప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంది♪.

*ఈ కథ విన్న తరువాత చెప్పేవారు:*

"పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, మలంతో అలుకు", అంటారు♪. వినడానికి కొంచం వింతగా వుంటుంది♪.  కాని అది వారి పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది♪. ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు, విన్నవాళ్లు తలపై వేసుకుంటారు♪. తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపు కొమ్మును చిన్నపిల్లలుకుకడతారు♪. అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు♪.

        ❀┉┅━❀🕉️❀┉┅━❀

*సేకరణ:*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat