మార్చి 25న పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, 2024 మార్చి 23: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 25న గరుడసేవ జరుగనుంది.
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
from TTD News https://ift.tt/uQhz6wE
via IFTTT