పాపపుణ్యల ప్రారబ్ధ కర్మ

P Madhav Kumar

 కర్మ సిధ్ధాంతం

మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశియస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము.  


ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము. అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, 


ఎన్నేళ్లు ఉంటామో అన్నేళ్ళు ఉంటాము. ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు బడుతుంది.


అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది. అవే సంచితకర్మలు.

ప్రారబ్ధ కర్మలు - అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు . 


ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ కర్మలు అయితే పక్వానికి వస్తాయో , లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ. ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే. ప్రారబ్ధం తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.


ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు, బంధవులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆయ వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము. ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయుపోగా , జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి. ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడాన ికి సిద్ధమవుతాయో, అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది* . అందుకే *ఆదిశంకరులు* భజగోవింద స్తోత్రంలో

పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం

అని అన్నారు.

మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము , అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము. అలాగే పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము. పాపం పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది. ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే. విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది...


శాంతిమంత్రం :

ఈ శాంతిమంత్రం మన భారతదేశపు సనాతనధర్మం యొక్క ఔనత్యాన్ని చెబుతుంది. "దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే విందునుగాక! మా నేత్రములు అన్నివేళలా శుభప్రదమగు దానినే దర్శించును గాక! మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదింపబడిన మంచి ఆయుష్షు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తుతించుచుందుము గాక! ఆది కాలము నుండి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక ! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయుగాక ! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక ! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక! "ఓం శాంతిః శాంతిః శాంతిః" (అధిభౌతికము, అధిదైవికము, ఆధ్యాత్మికము అనే మూడు తాపముల నుండి మాకు శాంతి కలుగుగాక అని మూడు "శాంతిః" లకు ఆర్థము.


ఉపనిషత్తు సారాంశము :

ఈ సమస్త జగత్తు ఓంకారమే. భూతభవిష్యద్వర్తమానాలు కూడా ఓంకారమే. ఈ జగత్తుకు, దానికి అతీతమైన పరమ సత్యానికి, ఓంకారం శబ్దరూపమైన ప్రతీక. ఈ ఓంకారం దేనికైతే ప్రతీకగా వుందో అదే బ్రహ్మం. ప్రతీ జీవుడిలో వున్న ఆత్మయే బ్రహ్మం...

.


ప్రాణాయామం (శ్వాస నియంత్రణ) చేయని వారికి యోగం ఉండదు. తాడు లేకుండా బావి నుండి నీరు లాగడం అసాధ్యం. బానిసత్వం నుండి విముక్తి లేని వారికి శాంతి ఉండదు. నీరు తాగకుండా ఎవరూ జీవించలేరు. మనస్సును నిర్మూలించిన వారు కోరికలు లేనివారు. ఆరవ నెల వరకు శిశువులు రాజయోగులు. మెదడు అభివృద్ధి చెందిన తర్వాత, అదే శిశువు హఠ యోగి. అటువంటి శిశువులలో మనస్సు చాలా చంచలమైనది. ఎందుకంటే వారిలో వివక్ష చూపే శక్తి తక్కువ. శిశువులు చక్కెర ముద్ద మరియు మట్టి ముద్ద మధ్య తేడాను గుర్తించలేరు. అందువల్ల, అటువంటి పిల్లలు భూమి మరియు చక్కెరను ఒకేలా భావిస్తారు. పండు ఎల్లప్పుడూ చెట్టు పైభాగంలో ఉంటుంది. అదేవిధంగా, మనిషిలో పండు పైకి ఉంటుంది. మీరు భూమిలో కొబ్బరిని నాటితే, చివరికి కొబ్బరి చెట్టు పైభాగంలో కొబ్బరికాయలు కనిపిస్తాయి. ప్రతి చెట్టుకు, పండు పైభాగంలో ఉంటుంది...

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat