శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయo

P Madhav Kumar



👉 హైదరాబాద్ : లాల్ దర్వాజ                               

💠 తెలంగాణ సంప్రదాయం పండుగలలో మొదటిది బోనాల పండుగ. 

ఆషాడ మాసంలో ఆదివారం నాడు గోల్కొండ కోటలో మొదలయి 1 నెల రోజుల పాటు సాగుతోంది. చివరన హైదరాబాద్ పాతనగరంలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో చివరగా బోనాల పండుగ ముగుస్తుంది. 

ఈ పండుగని వీక్షించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు.  

ఈ ఉత్సవం 2 రోజుల పాటు కొనసాగుతున్ననుంది.  

మొదటి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం, రెండవ రోజు రంగం కార్యక్రమం. 

                          

💠 పోతారాజుల నృత్యాలు, శివసత్తుల విన్యాసాలు, వివిధ డప్పుల దరువులు, బోనాము ఎత్తిన మహిళల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

 బోనం ఎత్తిన మహిళలను అమ్మవారి స్వరూపంగా భావించి వారి పాదాలకి మంచినీటితో సాకగా పోస్తారు. 

బోనం తయారు కోసం మొదటగా ఒక కొత్త కుండాని కొనుగోలు చేసి, పవిత్రముగా అన్నాన్ని వండి ఈ కుండలో ఉంచి ,ఘటానికి, కుండ కి కుంకుమ, పసుపు, వేప చెట్టు ఆకులతో అలంకరణ చేసి పూజ మొదలు పెడుతారు. 



🔔 శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయచరిత్ర : 

                               

💠 పాతబస్తీలో ఎన్నో దేవాలయాలు ఉన్నపటికీ అందరిచే పూజలు అందుకుంటూ 1 స్థానంలో ఉండేది మాత్రం శ్రీ సింహవాహిని మహంకాళి మాత ఆలయం.


                      

💠 1908 లో మూసినదికి వరదలు సంభవిస్తాయి. హైదరాబాద్ లోని ప్రజలు అందరు అతలాకుతలం అయిపోతారు. అప్పుడు ఈ ప్రాంతంని పరిపాలిస్తున 6వ నిజాం ప్రభువు "మహుమూద్ అలీఖాన్ " అనే రాజు. 

అతని దగ్గర ప్రధానిగా పని చేసే "కిషన్ ప్రసాద్" రాజు గారికి ఒక సలహా ఇస్తాడు. 

వరద పోటు ముప్పు వచ్చినది. 

ఈ వరద ముప్పు తగ్గుముఖం పట్టాలి అంటే లాల్ దర్వాజా లోని శ్రీ సింహవాహిని అమ్మవారి కి పూజలు నిర్వహిస్తే వరద తగ్గుముఖం పడుతుంద అని అంటారు. 

అప్పుడు నిజాం ప్రధాని కిషన్ ప్రసాద్ ఇచ్చిన సూచన మేరకు 6వ నిజాం నవాబు గారు పూజలు నిర్వహించి ఒక బంగారు చాటలో పట్టు వస్త్రాలు, మేలిమి ముత్యాలు , నగలు, బంగారు గాజులు పెట్టి వాటిని అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి వాటిని మూసీ నదిలో వదిలిపెడుతారు. 

అలా మూసీ నదిలో వదిలి పెట్టడం వల్ల వరద తగ్గుముఖం పడుతుంది. హైదరాబాద్ ప్రజలు అందరు సుఖసంతోషాలతో జీవిస్తారు.  

               

  

💠 అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆధీనంలోకి తీసుకున్నా తరువాత ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ ఉత్సవాలు మరో ఎత్తు. 


💠 రెండవ రోజు రంగం, రధోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంనికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారు ఒక మహిళా లోకి ఆవహించి భవిష్యత్ లో జరిగే పరిణామాలు, మొదలగు వాటిగురించి భవిష్యవాణి వినిపిస్తారు. 

ఈ భవిష్యవాణి వినడానికి కూడా ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటారు.


💠 రధోత్సవం లాల్ దర్వాజా ఆలయం నుంచి మొదలు పెట్టి అక్కన, మాదన్న ఆలయాలు కలుపుకొని, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల మీదుగా వెళ్తుంది.


💠 భోజనానికి రూపాంతరం బోనం. ఆషాఢంలో బోనాల్ని సమర్పించడమంటే, అమ్మ కృపవల్ల దక్కిన ఆహారాన్ని ఆ శక్తికే నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవడం ఈ సంప్రదాయం వెనుక పరమార్ధం.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat