కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే.....

P Madhav Kumar


కోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత.


'శివ' అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాది దేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి.


శర్వుడు,

భవుడు,

రుద్రుడు,

ఉగ్రుడు,

భీముడు,

పశుపతి,

మహాదేవుడు,

ఈశానుడు...


అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.


ఈ శర్వాది అష్టమూర్తులే..

పృథ్వి,

జలం,

అగ్ని,

వాయువు,

ఆకాశం,

క్షేత్రజ్ఞ,

సూర్యచంద్రులను..


అధిష్టించి ఉన్నాయి.


ఈ అష్టమూర్తులను ఆధారం చేసుకొని విశ్వమంతా వ్యాపించిన భగవంతుని సర్వతోభావంతో ఆరాధించాలని శివపురాణం తెలియజేస్తున్నది.


ఓం శర్వాయ క్షితిమూర్తయే నమః

ఓం భవాయ జలమూర్తయే నమః

ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః

ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః

ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః

ఓం పశుపతయే యజమానమూర్తయే నమః

ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమః

ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమః


దేహో దేవాలయః ప్రోక్తో జీహాదేవ సనాతనః |

త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావయే పూజయేత్ ||


జీవుని దేహమే దేవాలయం. మాయావిముక్తుడైన జీవుడే సదాశివుడు. అజ్ఞానమనే నిర్మాల్యాన్ని విడిచి పెట్టి "సో హం" భావంతో సదాశివుని, పూజించాలి.


రుద్రో జనానాం హృదయే సన్నివిష్టః | ప్రాణేష్యంతర్మనసో లింగమాహుః ||


హృదయంలో ఉన్నవాడు రుద్రాలింగశాబ్దవాచ్యుడైన శివుడిని శ్రుతులు చెబుతున్నాయి. అందుకే మన హృదయంలో ఆ ఆత్మలింగాన్ని స్థాపించుకొని నిర్మలమైన మనస్సు నుండి వెలువడే శ్రద్దా నదీజలంతో మహాదేవుని అభిషేకించి, సమాథి పుష్పాలతో పూజించి, మోక్షాన్ని పొందాలి.


బ్రహ్మచారులు యాజ్ఞవల్క్యుని చేరి “ఏ మంత్రంచేత మనుష్యుడు మోక్షంపొందుతాడు” అని అడిగారు.


దానికాయన.. "శతరుద్రీయేణేతి" అన్నారు..

అంటే.. శతరుద్రీయంచేత అని..


'శతం రుద్రా దేవతా యస్య'

నూరుమంది అంటే పెక్కుమంది రుద్రులు దేనికి దేవతలో అలాంటిది శతరుద్రీయం అని తైత్తరీయసంహిత చతుర్థకాండ పంచమ ప్రశ్నాత్మకమైన రుద్రాధ్యాయం పేర్కొంటున్నది...


 ఓం నమః శివాయ



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat