గుహలయం వసంతేశ్వరం...!!

P Madhav Kumar

🌸శిలలోని సౌందర్యాన్ని తమ బుధ్ధితో గ్రహించి వాటితో అద్భుతమైన కళాత్మక శిల్పాలు చెక్కి మన దేశానికి సరికొత్త అందాలను అందించిన మహాశిల్పులెందరో. అలాటి గొప్ప కళాకారులను ఆదరించి పోషించిన గొప్ప కళాపోషకులు పల్లవులు. పల్లవ చక్రవర్తులు , మహారాజులు

నిర్మించినగుహాలయాలెన్నో వారి కళాభిరుచికి తార్కాణాలుగా నిలిచిపోయాయి. 


🌸ఆవిధంగా అనేక  వింతలను, అతిశయ విశేషాలను తనలో నింపుకునివున్నది, మహేంద్రవర్మ కాలంనాటి ఒక గుహాలయం. 


🪷చెంగల్పట్టు నుండి తిరుక్కళ్ కున్డ్రమ్ వెళ్ళే మార్గం లో సుమారు

3 కి.మీ  దూరంలో   వల్లం అనే గ్రామం ఉన్నది.  ప్రకృతి అందాలతో  నిండి వున్న యీ గ్రామంలో  విశిష్టమైన విశేషాలు కలిగిన  ఒక గుహాలయం.



🌸1. మొదటి రోజుల్లో ఈ గుహాలయానికి చేరుకోవడానికి సరియైన మెట్లు లేవు. ఈ మధ్యకాలంలోనే మెట్లను అమర్చారు. 


🪷రాశి మెట్లు, పంచాక్షర మెట్లు, నవధాన్య మెట్లు నవలోహ మెట్లు, నవరత్న మెట్లు అనే పదహారు పేర్లతో   గుహాలయానికి వెళ్ళడానికి మార్గాలు ఏర్పడ్డాయి.



🪷2. ఒక చిన్న కొండ మీద మూడు అంతస్తులుగా ఈ గుహాలయాలు నిర్మించబడ్డాయి. సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన  గుహాలయాలు ఇవి.


🌸మెట్ల మీదుగా పైకి ఎక్కివెడితే మొదటగా కనిపించేది కరివరదరాజపెరుమాళ్

గుహాలయం. దీనిని పల్లవ చక్రవర్తి  పుత్రిక కొమ్మై నిర్మించినట్టు  గుహాలయంలోని శిలా శాసనాలు తెలుపుతున్నాయి. 


🪷3. ఇక్కడ పెరుమాళ్  శ్రీ దేవి భూదేవీలతో అనుగ్రహం కటాక్షిస్తున్నాడు. పక్కనున్న ద్వారపాలకులు చేతిలో ఏ ఆయుధాలు లేకుండా ఒక చేయి నడుముపై పెట్టుకొని మరో చేతితో చామరం వీచే దృశ్యం ఎక్కడా కానరాని భంగిమ.


🌸4.ఈ పెరుమాళ్  సన్నిధికి సమీపమున ఒక దొలచిన శిల్పంగా విష్ణు దుర్గని  దర్శిస్తాము.  దుర్గామాత వదనంలోని చిరునవ్వు దర్శకులకు ప్రశాంతతను చేకూరుస్తుంది.



🪷5. మెట్టమీద మధ్య భాగంలో  ఒక ధ్యాన మండపం వున్నది. 

ఇక్కడవున్న గుహాలయం లో  పాను వట్టము లేని పొడుగుపాటి స్ధంభ రూపంలోని  అతిశయ 

లింగమూర్తి దర్శనం అపురూపం.


🌸 లక్క సోమాచియార్ పుత్రిక   నిర్మించిన  దేవ కుళం యిది '  అని శిలా శాసనము ఒకటి కానవస్తుంది.  దేవకుళం  అంటే  దేవాలయం.  ఒక సామాన్య కుటుంబానికి చెందిన  స్త్రీ నిర్మించిన ఆలయం ఇది.



🪷6.మెట్ట శిఖరాన  వేదాంతేశ్వరుని ఆలయం  వున్నది. ప్రవేశ ద్వారము వద్ద శిలలతో దొలచిన బ్రహ్మాండమైన వినాయకుని  విగ్రహం  అత్యంత సుందరమైన మూర్తి. ఈ వినాయక స్వామి పదమూడు నామాలతో పూజించబడుతున్నాడు. ఒక ఆవరణలో జ్యేష్టాదేవి కొలువై వున్నది. 


🌸7.గర్భగుడి లో  వేదాంతేశ్వరుడు గంభీరంగా రుద్రాక్ష పందిరి క్రింద దర్శనం ప్రసాదిస్తున్నాడు. పల్లవుల కాలంలో సామంత రాజుగా వున్న

వయన్దప్రియుని కుమారుడు కంద సేనుడు  ఈ ఆలయం నిర్మించినట్టు శిలాశాసనం తెలుపుతున్నది.


🪷8.ఈ ఆలయ గర్భగుడిలోని స్ధంభాల మీద పగపిడుగు,లలితాంకురుడు,

శతృమల్లుడు, గుణభరుడు, మొదలైన 

మహేంద్ర వర్మ యొక్క బిరుదు నామాలు అన్నీ కనిపిస్తాయి.



🌸9.ఈశ్వరుని ద్వార పాలకులు  ఇద్దరు మళు అడియార్ ,(మళు అనే

ఆయుధం ధరించిన భక్తుడు) శూల 

అడియార్( శూలం ధరించిన భక్తుడు)  వ్యత్యాసమైన రూపాలతో కనిపిస్తారు.


🪷10. పరమశివుని ఎడమ భాగమున జ్ఞానాంబిక దేవిని దర్శిస్తాము.  త్రినేత్రములతో ఈ దేవి సిధ్ధురాలిగా భక్తులను కటాక్షిస్తున్నది.  ఈ దేవి కాళ్ళకు అలంకరించబడిన పాదరస గొలుసు సిధ్ధులచే  సమర్పించబడిన అతిశయ  సంపదగా

చెప్తారు.  


🌸వినాయకుడు, వళ్ళీ ,దేవయానీ సమేత కుమారస్వామి , చండికేశ్వరుని సన్నిధులు కూడా ఇక్కడ

వున్నాయి. 



🪷11. ఒక గొప్ప చక్రవర్తి,  మరో మహారాజు కుమార్తె,  ఒక సామాన్య స్త్రీ  - ఈ ముగ్గురిచే వివిధ దశలలో నిర్మించబడిన యీ గుహాలయాల ప్రాంతమంతా  వసంతేశ్వరంగా  ఖ్యాతి చెందినది



🌸12. ఏడుగురు సిధ్ధ పురుషులు నిత్యమూ పూజలు చేసే పవిత్ర ఆలయం.ఇక్కడి శివగంగా పుష్కరిణి , 

కొండ శిఖరాన వున్న పరమశివుని పవిత్ర చరణాలు శని దోష నివారణంగా  సంతాన భాగ్యం కలిగించే గణపతి నెలవైన పుణ్య క్షేత్రంగా వెలుగొందుతోంది యీ వల్లం వసంతేశ్వరం.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat