సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయం గవి గంగాదేవి ఆలయం

P Madhav Kumar

 గవి గంగాదేవి ఆలయం 

సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే 

ఆలయం గవి గంగాదేవి ఆలయం, కర్ణాటకలోని 

దక్షిణ బెంగళూరులో గవి పురంలో ఉన్నది. 

బెంగళూరు నగరనిర్మాత కెంపేగౌడ,గవి గంగాదేశ్వ 

ర గుహాలయం నిర్మించాడు.గుడిలో ప్రధాన దైవం 

శివ భగవానుడు. ఇందులో అరుదుగా కనిపించే, 

పూజించే అగ్నిదేవునివిగ్రహం ఉన్నది.ఈ అగ్నిదేవు

ని విగ్రహంతో పాటు మరో 33 విగ్రహాలు కూడా గుహాలయంలో ఉన్నాయి. ఒకే రాతి తో నిర్మించిన 

ఈ ఆలయం అద్భుత శిల్పకళ, వాస్తు శైలి కలిగి 

ఉంది.

బెంగళూరులో ఉన్న వారికి ఈ ఆలయం గురించి తెలుసుంటుంది. కర్ణాటకలోని నలుమూలల నుండి 

భక్తులు ఈ ఆలయ దర్శనానికి విచ్చేస్తుంటారు. 

ఈ ఆలయంలోని అనేక అపురూపమైన సంగతులు 

చాలా మందికి తెలియదు. ఇంతటి ప్రసిద్ది చెందిన 

దేవస్థానం గురించి మనం తెలుసుకుందాం..


గుహలోపల శివుడు వెలసి ఉంటాడు కనుక శివుని 

తలలో గంగను అలంకరించు కోవడం వల్ల ఈ 

ఆలయానికి గవి గంగాధరేశ్వర ఆలయం అని పేరు 

వచ్చింది. ఇంకా ఈ దేవాలయంలోని గర్భగుడిలో 

ఒక పక్కగా చిన్న గుంత ఉంది. ఇందులో నిత్యం 

గంగాజలం ఊరుతూ ఉంటుంది. గంగా ప్రవాహం 

ఉండటం వల్లే ఇక్కడ దక్షిణామూర్తి గంగాధరేశ్వరు

డిగా కొలువయ్యాడని ప్రతీతి.

ఈగవిగంగాధరుడిని దర్శించడంవల్ల ఆత్మలింగా

న్ని దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం లభిస్తుంది. 

ఈఆలయం16వ శతాబ్ధంలో నిర్మితమైనది. భారత  దేశంలోని రాతికట్టడాల్లో గవి గంగాధరేశ్వరుడి ఆల

యం ఒకటిగా చెప్పవచ్చు.ఈ ఆలయప్రాంగణంలో  

అనేక ఏకశిలాశిల్పాలున్నాయి

ఈ ఆలయాన్ని ఏక శిలా రాతితో కట్టడం జరిగింది. 

ఈ ఆలయం ఒకే నల్లరాతితో చెక్కిన అత్యధ్బుత 

శిల్ప కళాఖండం.


పూర్వకాలంలో భరద్వాజ ముని గౌతమ మహర్షి 

ఇద్దరూఇక్కడ తపస్సుచేశారని చరిత్ర చెబుతుంది

వారు ఇద్దరూ వేకువజామునే వారణాసిలో పూజ ముగించుకుని మధ్యాహ్న సమయంన గవిపురం

లో పూజచేసుకుని,సాయంత్రానికల్లా శివగంగలో 

మూడు సార్లు పూజలు చేసేవారు.


ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని

ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని చెబుతుంటారు. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ ముఖంగా ఉండటం విశేషం. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కుడివైపున ఆశీనురాలై పూజలందుకుంటోంది.


బెంగళూరులో గవిగంగాధరేశ్వరస్వామి సన్నిధానం

లో ప్రతి మకర సంక్రాంతి రోజున సూర్యరశ్మి శివలిం

గాన్ని స్పర్శిస్తుంది. ఈ సుందర దృశ్యాన్ని చూడటా

నికి ప్రజలు చుట్టుపక్కలనుండి వచ్చి వీక్షిస్తుంటారు

స్వయంగా సూర్యుడే ఈ సంక్రాంతి రోజున సాయం

త్రం 5గంటల నుండి 5.20 నిముషాల మద్యలో 

సూర్యుడు శివలింగాన్ని స్పర్శించి పూజిస్తాడు. ఈ ఆలయాన్ని ఉదయం 7 గంటలనుండి మధ్యాహ్నం 

12.30 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 

రాత్రి 8.30 వరకు ఈ గుహాలయాన్ని దర్శించవచ్చు


ఈశివాలయంలో శివున్నిదర్శించాలంటే ముందుగా నందీశ్వరున్ని దర్శించి తర్వాత ఆయన కొమ్ముల 

మధ్య నుండి శివున్ని దర్శించుకోవడం అనాదిగా 

వస్తున్న ఆచారం. నందీశ్వరుడు హిందూ ధర్మానికి 

ప్రతీకగా ఉన్నాడు.నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి మరొకటి సుదర్శన చక్రానికి నిదర్శనం

గా చెబుతారు.


లింగరూపంలోఉన్న పరమేశ్వరున్ని దర్శించాలంటే, ముందుగా నందీశ్వరున్ని పువ్వులతో పూజించి 

తర్వాత ఎడమ చేతి వేళ్ళను ఆయన కొమ్ములపై 

ఉంచి మూపురంపై తల వుంచి నందీశ్వర కొమ్ముల 

మద్య నుండి శివ దర్శనం ఏకాగ్రతతో చేసుకోవాలి. 

ఇలా దర్శించడం వల్ల మనం కోరిన కోరికలు నిజం అవుతాయి.


గవిగంగాధరేశ్వర ఆలయంలోరెండుసొరంగాలున్నా

యి. ఒకటి కాశీనుండి రావడానికి మరొకటి శివగంగ

కు వెళ్ళడానికి. పూర్వం భరద్వాజముని, గౌతమ 

మహర్షి కాశీ నుండి సొరంగ మార్గం గుండా గవి 

పురానికి వచ్చి ఇక్కడ పూజ ముగించుకుని తిరిగి సాయంత్రం పూజకు శివగంగకు సొరంగంగుండా 

వెళ్లేవారని మన పురాణాలు చెబుతున్నాయి.


భారతదేశంలో ప్రాచీన గ్రహాంతర దేవాలయాలలో 

గవి గంగధేశ్వర దేవాలయం ఒకటి.


ఆలయ విశిష్టత:

ఈఆలయంలోని ఉద్భవమూర్తియందు ఒక విశిష్టత 

ఉన్నది.అదేంటంటే లింగభాగంవేరుగా సోమసూత్రం వేరుగాఉంటుంది.లింగభాగంఅనగా పరమేశ్వరునికి 

ప్రతీక.అయితే సోమసూత్రం పార్వతీదేవి అని చెప్ప

వచ్చు.


ఈ ఆలయంలో పార్వతీపరమేశ్వరులు లింగరూపం

లో దర్శనమివ్వడం ఈఆలయం ప్రత్యేకత. ఇక్కడ శివలింగాన్నిదర్శిస్తే, కైలాసంలోని పార్వతీపరమేశ్వ

రులను దర్శించినంత పుణ్యం కలుగుతుందని 

భక్తుల నమ్మకం.ఏకాంతంగా ఒకేదేవాలయం ఉంటే 

దానిని దేవాలయం అనరు.ఈఆలయంలో గణపతి సుబ్రమణ్యేశ్వర స్వామి, చండికేశ్వర, నందీశ్వర, పార్వతీదేవి,నవగ్రహఉపాలయాలు వంటి పరివార 

దేవుళ్ళు ఉన్నారు

గర్భగుడి ప్రాకారంచుట్టూ ఇంద్రాణి,వారాహి,వైష్ణవి చాముండి, కౌమారి, మహేశ్వరి, బ్రాహ్మీ మొదలైన సప్తమాతృకల ఏకశిలా విగ్రహాలున్నాయి.


కార్తీకమాసంలో ఇక్కడస్వామికి విశేషఅలంకారాలు

వివిధరకాల అభిషేకాలుజరుగుతాయి. ప్రతి మాఘ మాసంలో బ్రహ్మరథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.వీటితో పాటు విశిష్ట దుర్గాహోమాలు, 

చండికహోమం,రుద్రాభిషేకాలు,నవగ్రహశాంతులు 

మొదలైన కార్యక్రమాలను ప్రతి రెండుసంవత్సరాల

కొకసారి నలభైఎనిమిది రోజులపాటు నిర్వహిస్తారు

ఆదిత్యనారాయణ..

ప్రాతః కాలంలో కాశీలో పూజచేసి సొరంగ మార్గాన 

గౌతమ ముని, భరద్వాజ మునులు మధ్యాహ్నం 

గవిపురానికి వచ్చేవారు.మధ్యాహ్నం పూజముగిం

చుకుని, తిరిగి సాయంత్రం శివ గంగకి ఈఆలయం 

సొరంగ మార్గం ద్వారా వెళ్లేవారు.


ఎలా వెళ్ళాలి.....

గవిగంగాధరేశ్వరుడిని చేరుకోవడానికి రైలు, రోడ్డు, 

విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులోని ప్రధాన బస్ స్టేషన్, రైల్వేస్టేషన్లు ఎదురెదురుగానే ఉంటాయి. అక్కడి నుండి లోకల్ బియంటిసి బస్సుల్లోప్రయాణించి రామకృష్ణఆశ్రమం 

దగ్గర దిగి, ఈ ఆలయానికి నడిచి వెళ్లొచ్చు. విమాన మార్గంలో ఎయిర్ పోర్ట్ కి సుమారు 35 కిలోమీటర్ల 

దూరంలో ఉంది. అక్కడినుండి రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat