Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

⚜ శ్రీ మాతా ముండేశ్వరి ఆలయం - ⚜ బీహార్ : కైమూర్

💠 ప్రపంచంలో పురాతన దేవాలయాలు, కట్టడాలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. వాటిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు. అలాంటి అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి బీహార్‌లో కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలో ఉన్న శ్రీ ముండేశ్వరీ ఆలయం.


💠 3,4 శతాబ్దాల కాలంలో శ్రీ మహావిష్ణువు ప్రధాన దేవతగా నిర్మించబడింది.  

కాలగర్భంలో విష్ణువు విగ్రహం కనుమరుగైంది.  క్రీ.శ. 348లో, ప్రధాన దేవుడైన విష్ణువుకు అనుబంధ స్థానాన్ని కలిగి ఉండి, ఆలయంలో చిన్న దేవతగా వినీతేశ్వరుని ఏర్పాటు చేశారు. 7వ శతాబ్దంలో, శైవమతం ప్రబలమైన మతంగా మారింది మరియు  వినీతేశ్వరుడు ఆలయ ప్రధాన దేవతగా ఉద్భవించాడు. 

 అతనికి ప్రాతినిధ్యం వహించే చతుర్ ముఖలింగం (నాలుగు ముఖాలు కలిగిన లింగం) ఆలయంలో ప్రధాన స్థానం పొందింది, అది ఇప్పటికీ ఉంది.


💠 ఈ ఆలయం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయటపడ్డాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన అమ్మవారి ఆలయం.


💠 భారతదేశంలోని అత్యధిక పూజలు నిర్వహించే అత్యంత పురాతన ఆలయాలలో ఇది మొదటిది. క్రీ.శ. 105లో నిర్మించిన మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం.

 దీనిని ముండేశ్వరీ అనే పర్వతం మీద ఉంటుంది. దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. 


💠 ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది.  

ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి. 

అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో దున్నపోతు పైన స్వారీ చేస్తూ మహిషాసురమర్ధిని రూపంలో ఉంటుంది. 


💠 ఇక్కడ ఆచారాలు మరియు పూజలు విరామం లేకుండా నిర్వహించబడుతున్నాయని నమ్ముతారు;  అందువల్ల ముండేశ్వరి ప్రపంచంలోని అత్యంత పురాతనమైన క్రియాత్మక హిందూ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.


💠 బీహార్‌లోని ప్రసిద్ధ ఆలయ వాస్తుశిల్పం అయిన నగారా నిర్మాణ శైలిని అనుసరించి అష్టభుజి ప్రణాళికపై ఈ ఆలయం నిర్మించబడింది.  

ఆలయానికి 4 వైపులా తలుపులు లేదా కిటికీలు మరియు మిగిలిన నాలుగు గోడలలో విగ్రహాల కోసం చిన్న గుళ్లు ఉన్నాయి.  ఆలయ గోపురం లేదా శిఖరం ధ్వంసం చేయబడింది మరియు పునర్నిర్మాణ సమయంలో పైకప్పు నిర్మించబడింది. ఆలయ లోపలి భాగంలో గొప్ప శిల్పాలు ఉన్నాయి.  


💠 ఆలయ ప్రవేశ ద్వారం గంగా, యమునా మరియు ఇతర మూర్తుల శిల్పాలు ఉన్నాయి.

ఇక్కడ శివుడు కూడా 4 ముఖాలతో ఉంటాడు. ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా ఉన్నాయి. 


💠 చైత్ర మాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

 పురావస్తుశాఖ అధికారులు భద్రతా కారణాల వల్ల 9 విగ్రహాలను కోల్‌కత్తా సంగ్రహాలయానికి తరలించారు. వాటిని ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. ఈ ఆలయాన్ని తాంత్రికపూజలకు ప్రతీకగా భావిస్తారు. 


🔅 ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి.


💠 ఈ ఆలయ అద్భుత రహస్యం ఏమిటంటే, మేకను ఇక్కడ మాముండేశ్వరి ముందు బలి ఇచ్చేటప్పు ఆ మేకను ముండేశ్వరి మాత పాదల చెంత  ఆ మేకను వుంచుతారు .

అలా ఉంచినప్పుడు ఆ మేక  చనిపోతుంది, అయితే కొన్ని క్షణాల తర్వాత పూజారి మళ్లీ మేకపై అమ్మా మొక్కి అక్షింతలు వేయ గానే

దీంతో ఆ మేక మరలా యథా స్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


💠 ఈ విధంగా, రక్తం లేని బలి ఇవ్వబడుతుంది ఇక్కడ .. మరియు ఇది ఎప్పటి నుండి జరుగుతుందో  తెలియదు.


💠 ముండేశ్వరి ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు శ్రీరామనవమి, శివరాత్రి మరియు నవరాత్రి.  

ఈ ఉత్సవాల సందర్భంగా ఈ పురాతన ఆలయానికి భక్తులు మరియు పర్యాటకులు పోటెతుత్తారు.

 

💠 పాట్నా, గయా మరియు వారణాసి వంటి సమీప నగరాల నుండి ఈ ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. 

ఆలయానికి 34 కి.మీ దూరంలో కుద్రా జంక్షన్ సమీప రైలు మార్గం.

 © Santosh Kumar

📢 Follow