🌹రాధా మాధవం🌹

P Madhav Kumar

అది ఒక అద్భుత  రాజోద్యానవనం. దేవలోకంలోని అపూర్వ సుగంధభరిత పుష్పాలన్నీ ఈ సుందరోద్యానవనంలో  మనోహరంగా  విరబూసి మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి.  మల్లె, మాలతి, జాజి, ఇరువాక్షి, చంపకం అనే  విరులు వికసించే 

చెట్లతో, లతాంతాలతో సువాసనలు వెదజల్లే ఆ వనం కనులకు, మధుర భావాలకి విందును చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. దానికితోడు ఉద్యానవనానికి ఆనుకొని ప్రవహిస్తున్న   యమునా నది పైనుండి వీచే చల్లని పిల్లగాలులు మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.

అటువంటి ఆ అందమైన వనంలోకి సాయంకాలం సంధ్యా  సమయాన పూజకి పుష్పాలు సేకరించడానికి

బర్సానా రాజ్య యువరాణి, మహారాజా వృషభానుని పుత్రికయైన  రాధ దేవి తన చెలికత్తెలతో వచ్చింది. ఉద్యానవనంలోని అందాలు  పరికిస్తూ , పువ్వుల సెజ్జ పట్టుకొని వయ్యారంగా నడుస్తోంది. అప్పుడు యమునా నది పైనుంచి వీచే చల్లని గాలి వచ్చి ఆమెను  మృదువుగా స్పర్శించింది. గాలిలో తేలుతూ వచ్చిన సుగంధ పరిమళ పుష్పాలు ఆమె పాదాలను సున్నితంగా తాకాయి. ఇది నిత్యం జరిగేదే. ఈ వనానికి రాధ తరచుగా వస్తూనే వుంటుంది.  వచ్చిన ప్రతిసారి  ఈ పుష్పాంజలి జరుగుతూనే

వుంటుంది. కాని యీ సారి ఒక చిన్న వ్యత్యాసం కనిపిస్తోంది.  చల్లని పిల్లతెమ్మెరలతో పాటూ వీనులవిందైన వేణుగానం కూడా ఎక్కడనుండో

సమ్మోహనంగా వినిపిస్తోంది. కో..యని కూసే కోయిలలు , ఛెంగు ఛెంగున పరుగులెత్తే జింకలు,  పురులువిప్పి ఆడే మయూరాలు, నదీ తరంగ వీచికలు వమ  అన్నీ  ఒక్కసారిగా  ఆ మురళీ రాగ ఆలాపనకు పరవశం పొంది నిశ్చలంగా వుండిపోయాయి. ఆ వేణుగానానికి  వమ రాధ హృదయం కూడా ఆనందంతో ఉర్రూతలూగింది.  తనను తాను మరచి పోయింది. తండ్రి అయిన

వృషబానుని మరచి పోయింది. తన పరిసరాలన్నీ మరచిపోయింది.

తానొక రాచకన్యననే విషయం కూడా మరచి పోయింది. 

ఆమె సున్నితమైన సుకుమార పాదాలు  ఆమెకి తెలియకుండానే

వేణుగానం వినిపించే దిశగా కదిలాయి.


అక్కడ నీలాకాశమే పరచుకొన్నట్లున్న ఒక అద్భుత సౌందర్యరాశిని  చూసింది. శిఖలో మెరిసే

నెమలిపింఛము , తామరపుష్పాల వంటి నేత్రాలు, మన్మధుని మరిపించే మందహాసాన్ని దర్శించింది.

ముల్లోక జీవులు శరణు కోరే దివ్యపాదారవిందాలను చూసింది. దర్శనమాత్రంచేతనే

తనని తాను  పూర్తిగా మరచింది.   తన జన్మ సార్ధకత పొందిన భావం కలిగి సంభ్రమంతో నిశ్చేష్టయైనది.


ఆ నీలమేఘశ్యామునికి తనకి ఎన్నో జన్మలబంధం నిశ్చయంగా వుండే వుంటుందన్నది రాధ అంతరంగం.  అదే నిజమవకూడదా అనే

ఆశతో అక్కడే నిలబడి పోయినది రాధ. కాలం తెలియలేదు.

రాధ నెచ్చెలియైన లలిత వచ్చి ఆమెను మెల్లగా అంతఃపురంలోకి తీసుకువెళ్ళింది. 

అంతఃపురంలోకి వెళ్ళినా 

రాధకి ఆ సమ్మోహనాకారుని చింతనే. నిద్రాహారాలు దూరమయాయి.

వేణుగాన మోహనుని దరహాసం ఆమె మనోఫలకంపై మెదలుతూ, మనసును కలవరపెట్టింది. ఆవేదనను పెంచింది.

తనకి తెలియకుండా కళ్ళు మూతలు పడినా కలగా కృష్ణుని సుందరాకారమే కనిపించి రాధ హృదయం విరహానికి

గురయింది.

రాధ బాధ చూసిన ఆమె చెలికత్తెలు లలిత, విశాఖలు కూడా

కలత చెందారు. 


ఆ సమయంలోనే రాధ

మనసులో భక్తి అనే యోగాగ్ని  పెంచడానికి

కృష్ణుడు వేద మంత్రాన్ని వేణువుపై వినిపిస్తూ అక్కడికి వచ్చాడు. చంద్రబింబం వంటి కృష్ణుని ముఖారవిందాన్ని గవాక్షం నుండి చూసిన

రాధ జన్మ సాఫల్యాన్ని పొందినది.  

భక్తితో కృష్ణుని రూపాన్ని

మనసులో సంపూర్ణంగా నింపుకున్నది.


చెలికత్తె లలితకి రాధాదేవి తీవ్ర  వేదన అర్ధమైనది .

తక్షణమే రాధకోసం ,

కృష్ణుని వద్దకు

రాయబారానికి వెళ్ళింది. 

విషయం

తెలుసుకున్న యశోదా తనయుడు యిలా అన్నాడు.

" రాధ, నేను  బ్రహ్మానంద

స్వరూపులము. ఏకాత్ములము. 

వేరు వేరు రూపా‌లతో కనిపిస్తున్నా నిజానికి  మేమిద్దరమూ ఒకటే. నాలో రాధ, రాధలో నేను కలసిపోయే వున్నాము.

మేము ఏనాడూ 

విడిపోవడమనేది లేదు.  మా యిద్దరిని

ఒక్కరిగా భావించి శ్రధ్ధా భక్తులతో  పూజించిన వారికి  వైకుంఠం ప్రాప్తిస్తుంది.


ప్రతిఫలం ఆశించకుండా నన్ను ధ్యానించే తాపసులను , భక్తులను తరింపజేస్తాను.

రాధ సదా  భక్తి తత్పరతతో నన్నే తలచుకుంటూ ఉన్నత స్ధానానికి చేరుకున్నది.. 

ఇంక కర్మయోగం ద్వారా

ఆమె నన్ను పొందగలదు.

వ్యాకుల పడవలసినది ఏమీ లేదు". అని అన్నాఢు కృష్ణుడు.

అందుకు లలిత

"కాని స్వామి!  భక్తి మార్గంలో వున్న రాధ  మిమ్మల్ని కర్మయోగం ద్వారా పొందగలగడం ఉన్నతమైన మార్గమా ? 

భక్తి యోగాన్ని అవమానపరచినట్టు కాదా ? " అని  ఒక న్యాయమైన ప్రశ్న వేసింది. లలిత ప్రశ్నలకి నవ్వుతూనే బదులిచ్చాడు ఆ  దీనదయాళుడు.


" మానవలోకానికి  నేను చేరే  మార్గాలను రానున్న కాలంలో  (భగవద్గీత లో) ఉపదేశిస్తాను . ఉపదేశించినవాడే దానిని ఆచరించకపోతే లోకం ఆచరిస్తుందా ?  అందుకే శ్రీ కృష్ణుని గా ఉపదేశించే నేను, రాధగా ఆచరణలో పెడతాను. 

ప్రధమంలోనే చెప్పాను .

మాలో తరతమ భేధములు  లేవని ."  " శ్రీ కృష్ణుని లీలలు చతుర్ముఖునికే  , అర్ధం కానప్పుడు, సామాన్య కన్యను నేనేమి గ్రహించగలను..అర్ధం చేసుకోవడం కష్టమే.

కాని కృష్ణా! రాధని ఫలితం ఆశించని కర్మయోగమార్గాన్న నిన్ను పూజించమని చెప్తాను. 

ఇప్పుడు వెళ్ళి వస్తా." అని  చెప్పి  కృష్ణుని వద్ద సెలవు తీసుకుని రాధ వద్దకు వెళ్ళింది  లలిత.


రాధ లలిత చెప్పిన విధంగానే వ్రతాలు, పూజలు

ఆరంభించింది. ఆమె తలపెట్టిన  వ్రతం సామాన్యమైనది కాదు..

శ్రీ కృష్ణుని చేరడానికి తులసి దేవిని ప్రార్ధిస్తూ

కఠోర దీక్షా వ్రతం ఆరంభించింది.

అతి మహిమాన్వితమైన తులసి పూజ విశిష్టత గురించి రాధకు లలిత , చంద్రలు ఇలా చెప్పారు.

"ఒక వ్యక్తి నాటిన తులసి మొక్క భూమి లోపలవరకు వ్రేళ్ళూని   ఆకులు, కొమ్మలు, పువ్వులు, వెన్నులు వేసి  అవి పచ్చగా పెరగడానికి సంరక్షణ చేస్తూ వున్నంతకాలం అతని వంశంలో వారందరూ  వైకుంఠంలో శ్రీ హరి సేవలో 2000 వేల కల్పాల వరకు తరిస్తూవుంటారు.

ఒకే ఒక తులసీ దళం సమర్పించినా ఎంతో పుణ్యం పొందుతారు.

తులసి వనం వున్న ప్రతి గృహము ఒక పవిత్ర  క్షేత్రం  అవుతుంది.

బంగారు, వెండి దానం చేయడం వలన కలగే పుణ్యం, ఒక తులసి మొక్కను నాటి ఆ దళాలతో భగవంతుని పూజిస్తే కలుగుతుంది. 


తులసి వనం వున్న గృహంలో యముని మీద వీచిన గాలి కూడా ఆ గృహంలోకి రాదు.  తులసి దళాన్ని  శిరస్సున

ధరించినవారి చెంత యముడు  చేరడానికి భయపడతాడు.  ఇలా ఎంతైనా తులసి ప్రశస్తిని   వర్ణించవచ్చును. ఇటువంటి మహిమలు కలిగిన తులసిని  పూజించడమే నారాయణుని చేరే మార్గమని చెలులైన, లలిత,  చంద్రరాణా

చెప్పగా రాధ నియమ నిష్టలతో తులసీ వ్రతం

ఆరంభించినది. 


కేతకీ వనంలో వంద అడుగుల  వలయాకార

భూమిలో  నవరత్నాలతోను , చింతామణులతోను అలంకరించిన కోటలో, 

అభిజిత్ ముహూర్తాన  

తులసీ దేవిని నాటి  గర్గమహర్షిని గురువుగా

స్వీకరించి వ్రతం ఆరంభించినది  రాధదేవి. 


ఆశ్వీయుజ శుక్లపక్ష పౌర్ణమి నుండి  ,చైత్ర మాస పౌర్ణమిదాకా  నిరాటంకంగా వ్రతం

సాగింది.  ఒక్కొక్క మాసం ఒక్కొక్క రసంతో తులసిని సేవించింది రాధ.

కార్తిక మాసం పాలతో, 

మార్గశిర మాసంలో చెఱుకు రసంతోను , పుష్య మాసంలో ద్రాక్ష రసంతోను,  మాఘ మాసంలో మామిడి పండ్ల రసంతోను, ఫాల్గుణ మాసంలో  వివిధ పళ్ళరసాలలో

పటిక బెల్లం కలిపిన మధురరసంతోను, చైత్రమాసంలో

పంచామృతాలతోను పూజించింది.


ఈ విధంగా వ్రతం  చేసిన రాధ  

విధి విధానంగా వైశాఖ మాసం , కృష్ణ పక్ష పాడ్యమి నాడు  ఉత్సవం జరిపి వ్రతం సంపూర్ణం

చేసింది.  రెండు లక్షలమంది మాధవ భక్తులకు, యాభై ఆరు రకాల పిండివంటలతో విందు భోజనం  పెట్టి , వస్త్రాభరణాలను

దానం చేసి ఘనంగా వ్రతం ముగించే సమయాన  దేవతలు పుష్ప వర్షం కురిపించగా

గంధర్వులు గానం చేస్తూండగా , నాలుగు

హస్తాలతో, శ్రీ కృష్ణుని వంటి 

నీల మేఘఛ్ఛాయతో, పట్టు పీతాంబరం ధరించి , గరుత్మంతుని మీద తులసీ దేవి ప్రత్యక్షమైనది.


ఆ దేవీ సాక్షాత్కారంతో  రాధ జన్మసాఫల్యం పొందిన భావంతో దేవి పాదాలకి

వందనం చేసి శరణాగతి పొందినది.  రాధను  ఆలింగనము చేసుకున్న తులసి దేవి "రాధా!  నా అనుగ్రహంతో , నీవు సదా శ్రీ కృష్ణునితోనే వుంటూ

యేనాడు కృష్ణుని వదలని సమున్నత స్థానాన్ని పొందుతావు. పాలలోనెయ్యి లా  నువ్వులలో నూనె వలె, ఏ భేధం లేకుండా మీరిద్దరు  కలసిమెలసేవుంటారు.  ఇదే ఈ తులసి నీకు అనుగ్రహిస్తున్న

వరం " అని

ఆశీర్వదించి తులసిదేవి  అంతర్ధానమయింది.


శ్రధ్ధాసక్తులతో తనని పూజించిన భక్తులకు సునాయాసంగా

వరాలిచ్చే తులసీ దేవి గురించి ఎంతని వర్ణించగలం ? 

గర్గ సంహితంలో, బృందావన కాండంలో, తులసి పూజ అనే 16 వ అధ్యాయంలో ఈ కధ వున్నది. 

ఈ కధని చదివిన వారు విన్న వారికి కూడా శుభాలు కలుగుతాయని

నారద మహర్షి తెలిపారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat